Trends

కరోనా దెబ్బ.. జట్టు జట్టునే మార్చేశారు


కరోనా కాలంలో క్రీడా రంగంలో ఎన్నెన్నో చిత్రాలు చూశాం. బయో బబుల్ అంటూ కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి.. అందులోనే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, నిర్వాహకులను ఉంచి.. వాళ్లు బయటికి రాకుండా, బయటివాళ్లు లోపలికి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసి మ్యాచ్‌లు నిర్వహించడం ఏడాది కిందట్నుంచే చూస్తున్నాం. వివిధ క్రీడల్లో లీగ్స్, టోర్నీలు, సిరీస్‌లు ఇలాగే నిర్వహిస్తూ వస్తున్నారు. ఐతే ఈ బబుల్‌ను పకడ్బందీగా నిర్వహించకుంటే ఏం జరుగుతుందో కూడా చూశాం.

ఐపీఎల్, పీఎస్‌ఎల్ లాంటి టోర్నీలు కరోనా కారణంగా అర్ధంతరంగా ఆగిపోవడం తెలిసిందే. పీఎఎల్‌ను ఇటీవలే పున:ప్రారంభించి పూర్తి చేశారు. ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో నిర్వహించబోతున్నారు. ఐతే ఇప్పుడు ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య రెండు రోజుల్లో వన్డే సిరీస్ మొదలు కావాల్సి ఉండగా.. కరోనా ఊహించని విధంగా దెబ్బ కొట్టింది.

శ్రీలంకతో వన్డే సిరీస్ అయ్యాక నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ముగ్గురు, సహాయ సిబ్బంది నలుగురు పాజిటివ్‌గా తేలారు. కేవలం ఆ ఏడుగురిని పక్కన పెట్టి మ్యాచ్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. ఆ ఏడుగురూ మిగతా వాళ్లతోనూ కలిసి ఉన్న వాళ్లే. దీంతో మొత్తం జట్టునంతా క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో సిరీస్‌ను రద్దు చేయడం మినహా మరో మార్గం లేదనే అనుకున్నారు. కానీ ఇంగ్లాండ్ బోర్డు ఆగమేఘాల మీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దేశవాళీ ఆటగాళ్లతో ఒక్క రోజు వ్యవధిలో కొత్త జట్టును సిద్ధం చేసింది. ఇందులో బెన్ స్టోక్స్ మినహా అందరూ కొత్త వాళ్లే. కానీ అందరూ కౌంటీల్లో, వివిధ క్రికెట్ లీగ్‌ల్లో రాటుదేలినవాళ్లే.

ఇలా ఒక సిరీస్ ఆరంభం కావడానికి రెండు రోజుల ముందు ఒక జట్టును పక్కన పెట్టి మరో జట్టును పోటీకి సిద్ధం చేయడం ఇంత వరకు జరిగి ఉండదేమో. కరోనా పుణ్యమా అని ఒక భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతుంటే.. మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లడం లాంటి అరుదైన దృశ్యాలూ చూడబోతున్నాం. మామూలుగా అయితే జూన్‌లో న్యూజిలాండ్‌తో టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగించుకుని భారత్ వెనక్కి వచ్చి, శ్రీలంకలో సిరీస్ ముగించుకుని మళ్లీ ఆగస్టులో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం అక్కడికి వెళ్లాల్సింది. కానీ క్వారంటైన్ నిబంధనల కారణంగా కోహ్లీసేన అక్కడే ఉంటోంది. మధ్యలో మరో జట్టును బీసీసీఐ శ్రీలంకకు పంపింది.

This post was last modified on July 7, 2021 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

25 minutes ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

1 hour ago

‘పాదయాత్ర చేసినా వైఎస్ వారసులు కాలేరు’

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాద‌యాత్ర…

1 hour ago

ఈ బీజేపీ ఎంపీకి ఏమైంది?

ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…

2 hours ago

కొణిదెల నిహారిక: ఫ్రేమ్ మారినా, గ్లామర్ మాత్రం అలాగే..

యాంకర్‌గా మొదలై, హీరోయిన్‌గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…

2 hours ago

తారక్ అభిమానులు లైట్ తీసుకున్నారు

స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…

5 hours ago