ప్రపంచ కుబేరుల జాబితాలో చాలా వేగంగా చోటు సంపాదించుకున్న వారిలో టెస్లా కార్ల అధినేత ఎలాన్ మాస్క్ ఒకరు. తక్కువ వ్యవధిలో సంపన్నుడిగా అవతారమెత్తిన ఆయన టైం ఈ మధ్యన అస్సలేం బాగోలేదన్న మాట వినిపిస్తోంది. మొన్నటికి మొన్న అంతరిక్ష ప్రయాణం గురించి పోస్టు పెడితే.. మళ్లీ రాకు.. అక్కడే ఉండిపో.. ఇంకా పైకిపో అంటూ నెటిజన్లు ఏసుకున్నారు. ఆ మధ్యన అతగాడు పెట్టిన ఒక ట్వీట్ కు ఏకంగా రూ.1.10లక్షల కోట్లు నష్టపోయాడు. అతగాడి కలల పంటగా చెప్పే స్పేస్ ఎక్స్ స్టార్ షిప్ సీరియల్ నెం.10ను ప్రయోగించిన పది నిమిషాలకే పేలిపోవటం.. మంటలు ఎగజిమ్ముతూ లాంచ్ పాడ్ మీద పడటం లాంటివెన్నో ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
ఇలా తరచూ ఏదో ఇష్యూలో దెబ్బ తింటున్న ఆయనకు..తాజాగా చోటు చేసుకున్న పరిణామం భారీ షాక్ ను ఇచ్చిందని చెప్పాలి. ఎలక్ట్రిక్ కార్లలో సంచలనంగా మారిన టెస్లా ఎస్ ప్లెయిడ్ తాజాగా ఆ కంపెనీకి.. ఎలాన్ కు దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది. తాజాగా ఈ కారు అమెరికాలోని పెన్సిల్వేనియాలో మంటలు చెలరేగి.. క్షణాల వ్యవధిలో కాలి బూడిదైంది. ఇది టెస్లాకు భారీ డ్యామేజీగా అభివర్ణిస్తున్నారు.
ఎందుకంటే..ఈ కారు భద్రతపై ఈ మధ్యన ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ.. వేగంలో ఫెరారీ.. భద్రతలో వోల్వో కంటే ఎస్ ప్లెయిడ్ ఉత్తమంగా ఉంటుందని చెప్పారు. ఆయన అంత గొప్పగా చెప్పటం.. తీరా చూస్తే.. కారు స్టార్ట్ చేసిన కొద్ది క్షణాలకే మంటలు రేగి కారు క్షణాల్లో బూడిద కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దాదాపు కోటి రూపాయిలు పెట్టి పెన్సిల్వేనియాకు చెందిన ఔత్సాహిక పారిశ్రాకవేత్త మార్క్ గెరాగోస్ ఇటీవల ఎస్ ప్లెయిడ్ ను కొనుగోలు చేశారు.
జులై ఒకటిన ఇంటి నుంచి బయలుదేరి బయటకు వచ్చేందుకు కారు తీయటం.. పది మీటర్లు ప్రయాణించినంతనే కార్లో మంటలు చెలరేగటాన్ని గమనించి.. బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. కానీ.. కుదర్లేదు. అతి కష్టమ్మీదా బయటపడ్డారు. ఇది తనకో భయంకర అనుభవంగా ఆయన అభివర్ణించారు. నిజమే కోటి రూపాయిలు పెట్టి కారు కొన్న తర్వాత.. క్షణాల్లో కాలి బూడిద కావటం ఎవరు మాత్రం జీర్ణించుకోగలరు?
This post was last modified on July 3, 2021 1:08 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…