Trends

మల్లీశ్వరికి అరుదైన గౌరవం

తెలుగింటి ఆడబడుచు, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న స్పోర్స్ట్ యూనివర్సిటికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించింది. దేశం మొత్తంమీద స్పోర్స్ట్ యూనివర్సిటి ఢిల్లీలోని ఏర్పాటవుతోంది. మరో పదేళ్ళ తర్వాత జరగబోయే ఒలంపిక్స్ పోటీల్లో దేశానికి 50 పతకాలకు తగ్గకుండా సాధించటమే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.

ఈ యూనివర్సిటిలో ఒలింపిక్స్ లో జరిగే అనేక క్రీడలకు సంబంధించి సిలబస్ ఉంటుంది. ఏ క్రీడలో ఆశక్తున్న విద్యార్ధులు ఆ క్రీడలకు సంబంధాంచిన డిపార్టమెంటులో చేరి శిక్షణ పొందవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, క్రికెట్, స్ప్రింట్, ఈత లాంటి అనేక క్రీడలకు సంబంధించిన నిపుణులను యూనివర్సిటిలో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులను యూనివర్సిటిలో చేర్చుకునే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలను ఏర్పాటుచేసింది.

ఈ యూనివర్సిటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చేరిన విద్యార్ధులకు సదరు క్రీడల్లో నైపుణ్యాన్ని బట్టి డిగ్రీలు కూడా ప్రధానం చేస్తారు. కాబట్టి బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలకు సమానస్ధాయిలోనే స్పోర్స్ట్ డిగ్రీలు కూడా ఉండేట్లు ఢిల్లీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటికి మొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.

శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000, సిడ్నీ ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంతకుముందు రెండుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్పులో రెండు బంగారు పతకాలు సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ పతకం సాధించటం మల్లీశ్వరితోనే మొదలైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్న మల్లీశ్వరిని వైస్ ఛాన్సలర్ గా నియమించటం సరైన నిర్ణయమనే భావించాలి.

This post was last modified on June 23, 2021 11:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

5 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

6 hours ago

మిస్సింగ్ కేసులు.. లండన్, అమెరికా కంటే మనమే బెటర్ అంట!

సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…

9 hours ago

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం…

9 hours ago

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…

10 hours ago

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

'ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…

11 hours ago