తెలుగింటి ఆడబడుచు, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న స్పోర్స్ట్ యూనివర్సిటికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించింది. దేశం మొత్తంమీద స్పోర్స్ట్ యూనివర్సిటి ఢిల్లీలోని ఏర్పాటవుతోంది. మరో పదేళ్ళ తర్వాత జరగబోయే ఒలంపిక్స్ పోటీల్లో దేశానికి 50 పతకాలకు తగ్గకుండా సాధించటమే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.
ఈ యూనివర్సిటిలో ఒలింపిక్స్ లో జరిగే అనేక క్రీడలకు సంబంధించి సిలబస్ ఉంటుంది. ఏ క్రీడలో ఆశక్తున్న విద్యార్ధులు ఆ క్రీడలకు సంబంధాంచిన డిపార్టమెంటులో చేరి శిక్షణ పొందవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, క్రికెట్, స్ప్రింట్, ఈత లాంటి అనేక క్రీడలకు సంబంధించిన నిపుణులను యూనివర్సిటిలో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులను యూనివర్సిటిలో చేర్చుకునే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలను ఏర్పాటుచేసింది.
ఈ యూనివర్సిటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చేరిన విద్యార్ధులకు సదరు క్రీడల్లో నైపుణ్యాన్ని బట్టి డిగ్రీలు కూడా ప్రధానం చేస్తారు. కాబట్టి బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలకు సమానస్ధాయిలోనే స్పోర్స్ట్ డిగ్రీలు కూడా ఉండేట్లు ఢిల్లీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటికి మొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.
శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000, సిడ్నీ ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంతకుముందు రెండుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్పులో రెండు బంగారు పతకాలు సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ పతకం సాధించటం మల్లీశ్వరితోనే మొదలైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్న మల్లీశ్వరిని వైస్ ఛాన్సలర్ గా నియమించటం సరైన నిర్ణయమనే భావించాలి.
This post was last modified on June 23, 2021 11:28 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…