Trends

మల్లీశ్వరికి అరుదైన గౌరవం

తెలుగింటి ఆడబడుచు, వెయిట్ లిఫ్టింగ్ దిగ్గజం కరణం మల్లీశ్వరికి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభమవుతున్న స్పోర్స్ట్ యూనివర్సిటికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని నియమించింది. దేశం మొత్తంమీద స్పోర్స్ట్ యూనివర్సిటి ఢిల్లీలోని ఏర్పాటవుతోంది. మరో పదేళ్ళ తర్వాత జరగబోయే ఒలంపిక్స్ పోటీల్లో దేశానికి 50 పతకాలకు తగ్గకుండా సాధించటమే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది.

ఈ యూనివర్సిటిలో ఒలింపిక్స్ లో జరిగే అనేక క్రీడలకు సంబంధించి సిలబస్ ఉంటుంది. ఏ క్రీడలో ఆశక్తున్న విద్యార్ధులు ఆ క్రీడలకు సంబంధాంచిన డిపార్టమెంటులో చేరి శిక్షణ పొందవచ్చు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, క్రికెట్, స్ప్రింట్, ఈత లాంటి అనేక క్రీడలకు సంబంధించిన నిపుణులను యూనివర్సిటిలో అధ్యాపకులుగా నియమిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్ధులను యూనివర్సిటిలో చేర్చుకునే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలను ఏర్పాటుచేసింది.

ఈ యూనివర్సిటి ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చేరిన విద్యార్ధులకు సదరు క్రీడల్లో నైపుణ్యాన్ని బట్టి డిగ్రీలు కూడా ప్రధానం చేస్తారు. కాబట్టి బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలకు సమానస్ధాయిలోనే స్పోర్స్ట్ డిగ్రీలు కూడా ఉండేట్లు ఢిల్లీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటికి మొదటి వైస్ ఛాన్సలర్ గా కరణం మల్లీశ్వరిని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది.

శ్రీకాకుళం జిల్లా ఊసవానిపేటకు చెందిన మల్లీశ్వరి 2000, సిడ్నీ ఒలంపిక్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించింది. అంతకుముందు రెండుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్పులో రెండు బంగారు పతకాలు సాధించింది. ఒలంపిక్స్ లో భారత్ పతకం సాధించటం మల్లీశ్వరితోనే మొదలైంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ జనరల్ మేనేజర్ గా ఉన్న మల్లీశ్వరిని వైస్ ఛాన్సలర్ గా నియమించటం సరైన నిర్ణయమనే భావించాలి.

This post was last modified on June 23, 2021 11:28 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

19 mins ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

1 hour ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

2 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

3 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

3 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

4 hours ago