కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.
కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా వేడి ప్రాంతాలయిన ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉంది. ఇండియాలో వైరస్ ఎంటర్ అయినా సమయం తీసుకుంటే దాదాపుగా ఇటలీ, అమెరికాతో సమానంగానే ఉంటుంది.
కానీ అక్కడి మాదిరిగా ఇక్కడ వ్యాప్తి చెందలేదు, అలాగే అన్ని మరణాలు కూడా సంభవించలేదు. అలా అని ఇక్కడ వైరస్ జీవించలేదు అనడానికి లేదు. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తే ఈ వైరస్ ప్రభావం అలాగే ఉంది. అందుకే మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిలో అంతమందికి ప్రాణాలు పోయాయి.
కాకపోతే ఉపరితలాలపై ఈ వైరస్ ఎక్కువ సమయం ఉండడం లేదని మాత్రం సంకేతాలు అందుతున్నాయి. అదీ కాక మన ప్రభుత్వం ముందే లాక్ డౌన్ ప్రకటించడం కూడా వ్యాప్తిని తగ్గించింది. ఏదేమైనా వైరస్ ని తేలికగా అయితే తీసుకోరాదు. మరో నాలుగు వారాల పాటు అయినా మనం లాక్ డౌన్ లో ఉన్నట్టయితే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపు చేయవచ్చు.
పొరపాట్లు అంటే ఏదో అనుకోకుండా జరిగింది అనుకోవచ్చు. కానీ అదే పనిగా రిపీట్ చేస్తే దాన్ని తప్పు అంటారు. బాలీవుడ్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై చాలాకాలంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి…
సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు…
లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు…
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలకు హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇదేసమయంలో ప్రభుత్వంపైనా…
సమంత మా ఇంటి బంగారం రిలీజై ఘనవిజయం సాధించాక ఆమె తల్లి కాబోతున్న వార్తను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.…