కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.
కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా వేడి ప్రాంతాలయిన ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉంది. ఇండియాలో వైరస్ ఎంటర్ అయినా సమయం తీసుకుంటే దాదాపుగా ఇటలీ, అమెరికాతో సమానంగానే ఉంటుంది.
కానీ అక్కడి మాదిరిగా ఇక్కడ వ్యాప్తి చెందలేదు, అలాగే అన్ని మరణాలు కూడా సంభవించలేదు. అలా అని ఇక్కడ వైరస్ జీవించలేదు అనడానికి లేదు. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తే ఈ వైరస్ ప్రభావం అలాగే ఉంది. అందుకే మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిలో అంతమందికి ప్రాణాలు పోయాయి.
కాకపోతే ఉపరితలాలపై ఈ వైరస్ ఎక్కువ సమయం ఉండడం లేదని మాత్రం సంకేతాలు అందుతున్నాయి. అదీ కాక మన ప్రభుత్వం ముందే లాక్ డౌన్ ప్రకటించడం కూడా వ్యాప్తిని తగ్గించింది. ఏదేమైనా వైరస్ ని తేలికగా అయితే తీసుకోరాదు. మరో నాలుగు వారాల పాటు అయినా మనం లాక్ డౌన్ లో ఉన్నట్టయితే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపు చేయవచ్చు.
This post was last modified on April 9, 2020 6:50 pm
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…