కరోనా వైరస్ ఉష్ణ వాతావరణంలో జీవించలేదు, అందుకని ఇండియన్స్ కి ఏం కాదు అంటూ వైరస్ ఇండియాలోకి రాకముందు నుంచీ వాట్సాప్ సైంటిస్టులు ప్రచారం చేస్తూ వచ్చారు. వైరస్ వచ్చేసింది అన్నా కానీ మనకేమీ కాదనే మొండి ధీమా మనలో చాలామంది చూపించారు. అయితే ఇందులో కొంత నిజం లేకపోలేదు. శీతల ప్రాంతాలతో పోలిస్తే ఉష్ణ ప్రాంతాలలో ఈ వైరస్ వ్యాప్తి మందకొడిగా ఉంది.
కేవలం ఇండియాలో అనే కాదు, మిగతా వేడి ప్రాంతాలయిన ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో కూడా వైరస్ వ్యాప్తి నెమ్మదిగానే ఉంది. ఇండియాలో వైరస్ ఎంటర్ అయినా సమయం తీసుకుంటే దాదాపుగా ఇటలీ, అమెరికాతో సమానంగానే ఉంటుంది.
కానీ అక్కడి మాదిరిగా ఇక్కడ వ్యాప్తి చెందలేదు, అలాగే అన్ని మరణాలు కూడా సంభవించలేదు. అలా అని ఇక్కడ వైరస్ జీవించలేదు అనడానికి లేదు. మనిషి నుంచి మనిషికి వ్యాపిస్తే ఈ వైరస్ ప్రభావం అలాగే ఉంది. అందుకే మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిలో అంతమందికి ప్రాణాలు పోయాయి.
కాకపోతే ఉపరితలాలపై ఈ వైరస్ ఎక్కువ సమయం ఉండడం లేదని మాత్రం సంకేతాలు అందుతున్నాయి. అదీ కాక మన ప్రభుత్వం ముందే లాక్ డౌన్ ప్రకటించడం కూడా వ్యాప్తిని తగ్గించింది. ఏదేమైనా వైరస్ ని తేలికగా అయితే తీసుకోరాదు. మరో నాలుగు వారాల పాటు అయినా మనం లాక్ డౌన్ లో ఉన్నట్టయితే వైరస్ వ్యాప్తిని పూర్తిగా అదుపు చేయవచ్చు.
This post was last modified on April 9, 2020 6:50 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…