కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మన ముందు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్. దీంతో.. దేశ ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. టీకా తీసుకున్న వారిలో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి సైడ్ ఎపెక్ట్స్ సాధారణంగా కనపడుతునే ఉన్నాయి.
అయితే.. వ్యాక్సిన్ వచ్చిన తొలి రోజుల్లో.. దీని కారణంగా చనిపోతున్నారంటూ చాలానే వార్తలువచ్చాయి. వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం అనారోగ్యానికి గురై మరణించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి మరణాలు పూర్తిగా వ్యాక్సిన్ వల్లే కావని వైద్యులు కొట్టిపారేశారు.
ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే చనిపోయినట్లు ఎక్కడా ధృవీకరించలేదు. కానీ మొదటిసారి వ్యాక్సిన్ వల్ల ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది. టీకా వేసుకున్న తరువాత వ్యాక్సిన్ దుష్ప్రభావాలను అధ్యయనం చేస్తున్న అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్(ఏఈఎఫ్ఐ) టీకా మరణాన్ని ధ్రుృవీకరించింది. మార్చి 8న కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకున్న 68 ఏళ్ల వ్యక్తి అనాఫిలాక్సిస్(తీవ్ర ఎలర్జీ) కారణంగా మరణించినట్లు మంగళవారం వెల్లడించింది. భారత్ లో వ్యాక్సిన్ కారణంగా చనిపోయిన ఏకైక వ్యక్తి ఇతనే కావడం గమనార్హం.
This post was last modified on June 15, 2021 3:38 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…