మన దేశంలో చాలా మంది బ్యాంకుల సొమ్ము వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి.. విదేశాలకు పారిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటివారికి కనీసం శిక్ష కూడా వేయలేదు. కానీ… కేవలం రూ.20 దొంగతనం చేశాడనే కారణంతో ఓ వ్యక్తికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇది కూడా మన దేశంలోనే.. ముంబయి నగరంలో కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయి నగరానికి చెందిన ఓ కార్మికుడికి బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు తాజాగా మూడేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20 దొంగలించాడనే కారణంతో.. ఈ శిక్ష వేయడం గమనార్హం. విచారణలో.. నిందితుడు తన నేరాన్ని అంగీకరించడం గమనార్హం.
అయితే.. దొంగతనం చేసే క్రమంలో.. నిందితుడు.. బాధితుడిని గాయపరిచాడట. అందుకే.. మూడేళ్ల శిక్ష వేశారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా.. దాదాపు ఏడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ క్రమంలోనే అతడు నేరం చేసినట్టు అంగీకరిస్తూ మార్చి నెలలో న్యాయస్థానానికి ఓ లేఖ ద్వారా తెలియజేశాడు.
ఇక.. అతడు స్వచ్ఛందంగా నేరం అంగీరించినట్టు కోర్టు భావిస్తున్నట్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే అతడు ఏడునెలలకు పైగా జైలు జీవితం గడిపిన విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ జడ్జి నిందితుడికి మూడేళ్ల శిక్ష విధించింది.
ఐపీసీ చట్టాల ప్రకారం.. దోపిడీ సమయంలో బాధితుడు గాయపడినట్టైతే నిందితుడికి గరిష్టంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. నేర తీవ్రతను బట్టి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను కూడా విధించొచ్చు.
This post was last modified on June 14, 2021 4:35 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…