ఆయనది అతిపెద్ద కుటుంబం. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటంబానికి యజమానికిగా రికార్డులెక్కారు. ఆయనే జియోనా చానా. కాగా.. 38 భార్యల ఈ ముద్దుల భర్త ప్రాణాలు కోల్పోయారు.
మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా చానా.. ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవలే 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. షుగర్, బీపీ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఐజ్వాల్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగునూమ్ గ్రామంలో తన 181 మంది కుటుంబ సభ్యులతో ( మనుమలు, మనవరాళ్లు కలిసి)తో నివసించేవాడు జియోనా చానా. కేవలం ఆయన కుటుంబాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేశారు. దీంతో ఆగ్రామం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. జియోనా చానా మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
This post was last modified on June 14, 2021 10:18 am
సోంపు గింజలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో భోజనం తర్వాత తప్పనిసరిగా తినేవారు. అయితే, ఇప్పుడా అలవాటు చాలా మందిలో తగ్గిపోయింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.…
తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం…
ఇంగ్లండ్పై టీ20, వన్డే సిరీస్లు చేజిక్కించుకున్నా తరువాత.. భారత జట్టులో బ్యాటింగ్ ఆర్డర్పై చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వికెట్ కీపర్…
టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా…
గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి.…