ఆయనది అతిపెద్ద కుటుంబం. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటంబానికి యజమానికిగా రికార్డులెక్కారు. ఆయనే జియోనా చానా. కాగా.. 38 భార్యల ఈ ముద్దుల భర్త ప్రాణాలు కోల్పోయారు.
మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా చానా.. ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవలే 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. షుగర్, బీపీ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఐజ్వాల్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగునూమ్ గ్రామంలో తన 181 మంది కుటుంబ సభ్యులతో ( మనుమలు, మనవరాళ్లు కలిసి)తో నివసించేవాడు జియోనా చానా. కేవలం ఆయన కుటుంబాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేశారు. దీంతో ఆగ్రామం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. జియోనా చానా మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
This post was last modified on June 14, 2021 10:18 am
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…