ఆయనది అతిపెద్ద కుటుంబం. 38 మంది భార్యలు, 89 మంది పిల్లలతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటంబానికి యజమానికిగా రికార్డులెక్కారు. ఆయనే జియోనా చానా. కాగా.. 38 భార్యల ఈ ముద్దుల భర్త ప్రాణాలు కోల్పోయారు.
మిజోరాం రాష్ట్రానికి చెందిన జియోనా చానా.. ఆనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఇటీవలే 76 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. షుగర్, బీపీ సమస్యలతో కొద్ది రోజుల క్రితం ఐజ్వాల్లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు.
సెర్చిప్ జిల్లాలోని బక్తాంగ్ త్లాంగునూమ్ గ్రామంలో తన 181 మంది కుటుంబ సభ్యులతో ( మనుమలు, మనవరాళ్లు కలిసి)తో నివసించేవాడు జియోనా చానా. కేవలం ఆయన కుటుంబాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేశారు. దీంతో ఆగ్రామం ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. జియోనా చానా మరణంపై మిజోరాం ముఖ్యమంత్రి జోరంతాంగ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
This post was last modified on June 14, 2021 10:18 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…