ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మీరే చనిపోయారని చెబితే ఎలా ఉంటుంది..? ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య.. బతుకు జీవుడా అనుకుంటున్న ఓ యువకుడికి.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.
ఆ ఫోన్ లో.. తాను చనిపోయానంటూ.. సదరు ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. అంతే.. బతికున్న తనని చనిపోయారంటూ చెప్పడంతో.. సదరు యువకుడికి మండిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. కాగా.. విషయం కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఏళ్ల సిద్ధాంత్ మిలింద్ భోస్లే గత నెల కరోనా బారిన పడ్డాడు. అతనొక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు కూడా. అయితే.. ఈ సోమవారం అతనికి ప్రభుత్వాస్పత్రి నుంచి తాను కరోనాతో మరణించినట్లు ఫోన్ వచ్చింది.
ఈ విషయం విన్న మిలింద్ షాక్కు గురై తన తల్లి సప్నాకు ఫోన్ ఇచ్చాడు. సదరు ఆసుపత్రి సిబ్బంది ఆమెకూ అదే విషయాన్ని తెలపగా.. కంగారు పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అంశంపై ఆరా తీశారు. కానీ.. తమకు వచ్చిన జాబితా ప్రకారమే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని సప్నా వివరించారు.
తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. అలాంటిది తనకు ఫోన్ చేసి తానే చనిపోయానంటూ వారు చెప్పడం షాకింగ్ కి గురి చేసిందని సదరు యువకుడు పేర్కొన్నాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండొచ్చని అంటుండగా.. మరికొందరు ప్రభుత్వాసుప్రతుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on June 10, 2021 8:22 am
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…