Trends

‘హలో.. మీరు కరోనాతో చనిపోయారు..!’

ఎవరైనా మీకు ఫోన్ చేసి.. మీరే చనిపోయారని చెబితే ఎలా ఉంటుంది..? ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య.. బతుకు జీవుడా అనుకుంటున్న ఓ యువకుడికి.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది.

ఆ ఫోన్ లో.. తాను చనిపోయానంటూ.. సదరు ఆస్పత్రి సిబ్బంది చెప్పడం గమనార్హం. అంతే.. బతికున్న తనని చనిపోయారంటూ చెప్పడంతో.. సదరు యువకుడికి మండిపోయింది. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశాడు. కాగా.. విషయం కాస్త వైరల్ గా మారింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మహారాష్ట్ర సతారా జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఏళ్ల సిద్ధాంత్ మిలింద్ భోస్లే గత నెల కరోనా బారిన పడ్డాడు. అతనొక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు కూడా. అయితే.. ఈ సోమవారం అతనికి ప్రభుత్వాస్పత్రి నుంచి తాను కరోనాతో మరణించినట్లు ఫోన్ వచ్చింది.

ఈ విషయం విన్న మిలింద్ షాక్‌కు గురై తన తల్లి సప్నాకు ఫోన్ ఇచ్చాడు. సదరు ఆసుపత్రి సిబ్బంది ఆమెకూ అదే విషయాన్ని తెలపగా.. కంగారు పడి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఈ అంశంపై ఆరా తీశారు. కానీ.. తమకు వచ్చిన జాబితా ప్రకారమే ప్రజలకు సమాచారం అందిస్తున్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని సప్నా వివరించారు.

తాను ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నానని.. అలాంటిది తనకు ఫోన్ చేసి తానే చనిపోయానంటూ వారు చెప్పడం షాకింగ్ కి గురి చేసిందని సదరు యువకుడు పేర్కొన్నాడు. ఈ విషయం నెట్టింట వైరల్ అవుతుండటంతో.. నెటిజన్లు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండొచ్చని అంటుండగా.. మరికొందరు ప్రభుత్వాసుప్రతుల పనితీరును ప్రశ్నిస్తున్నారు.

This post was last modified on June 10, 2021 8:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

23 minutes ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

3 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

3 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

3 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

4 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

5 hours ago