తమ దగ్గర మిగిలిపోయిన 8 కోట్ల టీకాలను ప్రపంచదేశాలకు పంపిణీ చేయనున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జై బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. బైడెన్ ప్రకటన రాగానే ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు అనేక దేశాల అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఇతర దేశాలకు అమెరికా సరఫరా చేయబోతున్న 8 కోట్ల టీకాల్లో మన దేశానికి రాబోతున్నది మ్యాగ్జిమమ్ 10 లక్షల టీకాలేనట.
అమెరికా నుండి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మెక్సికో, ధక్షిణకొరియా లాంటి దేశాలకు కూడా టీకాలు సరఫరా అవబోతున్నాయి. మొత్తం 8 కోట్ల టీకాల్లో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు 2.5 కోట్ల టీకాలు అందుతాయి. వీటిలో ధక్షిణ, మధ్య అమెరికాకు 60 లక్షల డోసులు, ఆసియా దేశాలకు 70 లక్షలు, ఆఫ్రికా దేశాలకు మరో 50 లక్షలు సరఫరా అవబోతున్నాయి.
పైకేమో ప్రపంచదేశాలకు అమెరికా టీకాలను సరఫరా చేస్తోందని ప్రచారం జరుగుతున్నా అతర్లీనంగా పెద్ద రహస్యం దాగుందట. పేరుకు 8 కోట్ల డోసులను అమెరికా సరఫరా అవుతున్నా ఇందులో 6 కోట్ల డోసులు ఆస్ట్రాజెనికా కంపెనీ తయారుచేసిన (కోవీషీల్డ్) టీకాలేనట. అమెరికాలో వేస్తున్న టీకాలన్నీ మూడు కంపెనీలు ఫైజర్, మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసినవి మాత్రమే. మరి ఈ కోవీషీల్డ్ టీకాలు అమెరికాకు ఎలా వచ్చాయి ?
ఎలాగంటే ముందే అమెరికా చేసుకున్న ఒప్పందం కాబట్టి. పై మూడు కంపెనీల టీకాలు మార్కెట్లో పూర్తిస్ధాయిలో రాకముందే సీరమ్ కంపెనీ ఉత్పత్తి కోవీషీల్డ్ మార్కెట్లోకి వచ్చేస్తుందన్న అంచనాతో అమెరికా ఒప్పందం చేసుకుంది. అయితే పై కంపెనీల టీకాలన్నీ దాదాపు ఒకే సమయంలో మార్కెట్లోకి వచ్చాయి. దాంతో అమెరికాలో జనాలు కోవీషీల్డ్ ను వాడటంలేదు. ఈ కారణంగానే కోవీషీల్డ్ 6 కోట్ల డోసులు అమెరికాలో మురిగిపోతున్నాయి.
అలాగే పై కంపెనీల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టీకాలపై అనేక ఆరోపణలున్నాయి. కాబట్టి 2 కోట్ల డోసులు మిగిలిపోయాయి. అందుకనే తాము వాడకుండా మిగిలిపోయిన 8 కోట్ల డోసులను అమెరికా ప్రపంచదేశాలకు పంపిణీ చేసేస్తోందని ఢిల్లీ యూనివర్సిటి ప్రొపెసర్, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు కుమార్ సంజయ్ సింగ్ తెలిపారు. మొత్తానికి తమకు అవసరం లేనివాటిని వితరణ పేరుతో వదిలించేసుకోవటంలో అమెరికా తెలివి అమోఘం.
This post was last modified on June 6, 2021 2:03 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…