యువతితో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా… నిందితుడిని కేవలం 48గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నార్త్ ఇండియాకు చెందిన ఓ యువతి బెంగళూరులో నివసిస్తోంది. కాగా.. మే 31వ రాత్రి ఓ ఫుడ్ డెలివరీ బాయ్.. సదరు యువతి పట్ల నీచంగా ప్రవర్తించాడు. వెనక నుంచి యువతిని అసభ్యంగా తాకాడు. ఈ ఘటనతో భయపడిపోయిన యువతి.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని 48గంటల్లో పట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు అరుణ్ కుమార్, అతని సోదరుడు బెంగళూరులోని ఫుడ్ డెలివరీ సంస్థలో పనిచేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనూ వీరిద్దరు సోదరులు ఫుడ్ డెలివరీ చేశారు.
నిందితుడు అరుణ్ రాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ చేయగా.. అతని సోదరుడు ఉదయం పూట ఫుడ్ డెలివరీ చేసేవాడు. ఈ క్రమంలో.. అరుణ్ కుమార్.. గత నెల మే 31వ తేదీ రాత్రి ఫుడ్ డెలివరీ చేయడానికి వెళుతూ.. ఓ యువతిని అసభ్యంగా తాకాడు.
ఘటనతో భయపడిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. వారు 40 సీసీ కెమేరాల ఆధారంగా దాదాపు 80 బైకులను పరిశీలించారు. కాగా.. నిందితుడు గేర్ లేని స్కూటర్ వినియోగిస్తున్నాడని గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా ముందు నిందితుడు సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నేరం చేసింది అరుణ్ కుమార్ గా గుర్తించారు. కాగా.. నిందితుడు.. గతంలో మరో ముగ్గురు, నలుగురు యువతులతో ఇదే విదంగా ప్రవర్తిచినట్లు తేలడం గమనార్హం.
This post was last modified on June 5, 2021 10:34 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…