కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని దేశప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారే ఇంకా వదల్లేదురా భగవంతుడా అంటే.. రోజుకో కొత్త రకం ఫంగస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ కేసులు వేలల్లో నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారిని ఇప్పుడీ ఫంగస్ లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకో విచిత్ర కేసు బయటపడింది.
కర్నాటకలోని చిత్రదుర్గలో స్కిన్ బ్లాక్ ఫంగస్ వెలుగు చూసింది. దేశంలోనే ఇది తొలి కేసు. 54 ఏళ్ల వ్యక్తికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుడు నెల రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్నాడు. అతనికి షుగర్ కూడా ఉంది.
కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్ ఫంగస్ కనిపించిందని చెప్పారు డాక్టర్లు. అక్కడ చర్మం నల్లగా అయిపోవడాన్ని గుర్తించారు. అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
This post was last modified on June 2, 2021 3:32 pm
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత…
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు.…