కరోనా మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని దేశప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ మహమ్మారే ఇంకా వదల్లేదురా భగవంతుడా అంటే.. రోజుకో కొత్త రకం ఫంగస్ లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే.. బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు బయటపడ్డాయి. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ కేసులు వేలల్లో నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారిని ఇప్పుడీ ఫంగస్ లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంకో విచిత్ర కేసు బయటపడింది.
కర్నాటకలోని చిత్రదుర్గలో స్కిన్ బ్లాక్ ఫంగస్ వెలుగు చూసింది. దేశంలోనే ఇది తొలి కేసు. 54 ఏళ్ల వ్యక్తికి స్కిన్ మ్యూకోయిడ్ మైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుడు నెల రోజుల క్రితం కరోనా బారినపడి కోలుకున్నాడు. అతనికి షుగర్ కూడా ఉంది.
కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్ ఫంగస్ కనిపించిందని చెప్పారు డాక్టర్లు. అక్కడ చర్మం నల్లగా అయిపోవడాన్ని గుర్తించారు. అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
This post was last modified on June 2, 2021 3:32 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…