కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ప్రపంచదేశాలు కొత్తరకం పాస్ పోర్టును తీసుకు రాబోతున్నాయా ? అవునే సమాధానం వినిపిస్తోంది. ఈ కొత్తరకం పాస్ పోర్టే వ్యాక్సిన్ పాస్ పోర్టట. మామూలుగా అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యెమెంట్ల విషయంలో జాగ్రత్తగానే ఉంటారు. కానీ ఇపుడు దగ్గర పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్లతో పాటు వ్యాక్సిన్ పాస్ పోర్టు కూడా చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది.
ఇంతకీ వ్యాక్సిన్ పాస్ పోర్టు అంటే ఏమిటంటే తమకు కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణగా చెప్పే సర్టిఫికేటే. అవును ఏదైనా విదేశానికి ప్రయాణం చేయాలంటే ఇపుడు అనేక సర్టిఫికేట్లను చూపించాల్సుంటుంది. విమానం ఎక్కేటపుడు, దిగేటపుడు కూడా ఈ సర్టిపికేట్లు చూపటం చాలా అవసరం. కొన్నిసార్లయితే మధ్యలో ఒకటిరెండు విమానాలను మారాల్సుంటుంది.
ఇలాంటపుడు ప్రతి విమానం ఎక్కేటపుడు సర్టిపికేట్ చూపాలంటే చాలా కష్టంగా ఉంటోందని అంతర్జాతీయ టూరిజం గుర్తించింది. అందుకే అనేక సర్టిఫికేట్లను ప్రతిసారీ చూపించేబదులు ఒకే సర్టిఫికేట్ చూపిస్తే చాలని ప్రపంచదేశాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే కరోనా వైరస్ సోకలేదని చెప్పే సర్టిఫికేట్ ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉండటమే. కాబట్టి ఏ దేశంలో అయినా చెల్లుబాటయ్యేట్లుగా ఒకే సర్టిఫికేట్ ను జారీచేసేందుకు ప్రపంచదేశాలు కసరత్తు చేస్తున్నాయి.
ఇకనుండి ఎవరైనా ఒకదేశం నుండి మరొక దేశానికి ప్రయాణం చేయాలనుకునే వారు తమ డాక్యుమెంట్లతో పాటు కరోనా వైరస్ నెగిటివ్ సర్టిఫికేట్ ను కూడా రెడీ చేసుకుంటే సరిపోతుంది. తొందరలోనే ఈ సర్టిఫికేట్ డిజైన్ పూర్తవుతుంది. అప్పుడు దాన్ని అన్నీ దేశాలకు పంపించి ఆమోద ముద్రవేసేట్లు కసరత్తు జరుగుతోంది. ఒకసారి ఈ డిజైన్ రెడీ అయిపోతే సర్టిపికేట్ విషయంలో చాలా సమస్యలు తప్పుతుందేమో.
This post was last modified on May 25, 2021 7:14 am
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…