ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ మొదలై మూడు నెలలు దాటింది. ముందు నుంచి ఇక్కడ ఉత్పత్తి అవుతున్నవి, వ్యాక్సినేషన్ మొదలయ్యాక జనాలకు ఇస్తున్నవి కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు మాత్రమే. వీటిలో కోవాగ్జిన్ ఉత్పత్తి మరీ తక్కువగా ఉండగా.. దాంతో పోలిస్తే ఉత్పత్తి మూడు రెట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కోవిషీల్డ్ ఇక్కడి డిమాండుకు సరిపోవట్లేదు. వ్యాక్సినేషన్ మొదలైన కొత్తలో కరోనా ప్రభావం తక్కువగా ఉండేసరికి టీకా వేయించుకోవడానికి జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు. ఆ సమయంలో ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం వహించింది.
దేశంలో ఉన్న వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచడంలో కానీ, విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులిచ్చి భారత్కు తీసుకురావడంలో కానీ చొరవ చూపించలేదు. కానీ చూస్తుండగానే వైరస్ ఉద్ధృతి పెరిగిపోయింది. వ్యాక్సిన్ కోసం డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆశగా విదేశీ వ్యాక్సిన్ల వైపు చూస్తున్నారు.
ఇండియా ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు కొత్తగా ఒక విదేశీ వ్యాక్సిన్ భారత్లో అడుగు పెడుతోంది. రష్యా అభివృద్ధి చేసి, ఆ దేశ ప్రజలకు అందిస్తున్న ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ డోసులు భారత్లోకి దిగుమతి అయ్యాయి. రష్యా తయారు చేసిన స్పుత్నిక్-వి టీకాను ఇండియాలో పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. ఆ సంస్థకు అనుమతులు కూడా లభించాయి.
భారత్లోకి స్పుత్నిక్-వి డోసులు ఓ మోస్తరు స్థాయిలోనే వచ్చాయి. హైదరాబాద్కు లక్షన్నర దాకా డోసులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా కొన్ని టీకా డోసులను పరిశీలనకు ఉపయోగించే అవకాశముంది. వ్యాక్సిన్ వేసుకున్న వెంటనే మన జనాల్లో దుష్పరిణామాలు ఏమైనా తలెత్తుతున్నాయేమో చూసి.. ఆ తర్వాత టీకా కేంద్రాలకు డోసులు పంపించనున్నారు. వచ్చే వారం నుంచే ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సినేషన్ ఆరంభం కానున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కోవాగ్జిన్, కోవిషీల్డ్ ఉత్పత్తి కూడా పెంచుతుండటంతో త్వరలోనే టీకా కొరత కొంతమేర తగ్గుతుందని భావిస్తున్నారు. ఫైజర్ సహా మరికొన్ని విదేశీ టీకాలు త్వరలోనే భారత్కు వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on May 14, 2021 11:01 am
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…