కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ లక్షల మందిని వైరస్ బాధితులుగా మారుస్తోంది. రోజూ వేలమంది చనిపోతున్నారు. ఈ సమయంలో బాధితులను ఆదుకోవడానికి, అలాగే నిర్విరామంగా సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేయడానికి సెలబ్రెటీలెందరో ముందుకు వస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. జనాల నుంచి కూడా విరాళాలు స్వీకరిస్తున్నారు.
దేశంలో పరిస్థితులు చూసి చలించిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అయిన అతడి సతీమణి అనుష్క శర్మ కలిసి ఒక ఇనిషియేటివ్ మొదలుపెట్టారు. స్వయంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించి.. కీటో సంస్థతో కలిసి నిధుల సేకరణకు నడుం బిగించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలన్నది వీరి ప్రణాళిక. ఈ మంచి పనికి జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది. 24 గంటల్లో విరాళాల మొత్తం రూ.3.6 కోట్లకు చేరుకుంది.
ఒక్క రోజులో సగం టార్గెట్ అందుకున్నామని, రూ. 7 కోట్ల టార్గెట్ను కూడా అందుకుంటామని మొన్న కోహ్లి ట్వీట్ చేశాడు. ఐతే రెండు రోజులు తిరిగేసరికి టార్గెట్ మొత్తాన్ని దాటిపోయి విరాళాల మొత్తం రూ.11 కోట్లకు చేరిపోవడం విశేషం. సామాన్య జనం రూ.4 కోట్ల దాకా విరాళాలు అందజేయగా.. కోహ్లి, అనుష్క అందించిన మొత్తంతో కలిపి రూ.6 కోట్ల మార్కును టచ్ చేసింది ఫండ్.
ఐతే ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ విరుష్క జోడీ చేస్తున్న మంచి పనికి తోడ్పాటు అందించాలని భావించింది. వాళ్లు ఏకంగా రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో విరుష్కల సహాయ నిధి మొత్తం రూ.11 కోట్లకు వెళ్లిపోయింది. ఎంపీఎల్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పిన కోహ్లి.. రూ.11 కోట్ల మొత్తాన్ని కీటో సంస్థతో కలిసి కొవిడ్ సహాయ చర్యలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించాడు. విరుష్క జోడీని చూసి మరింతమంది సెలబ్రెటీలు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నారు.
This post was last modified on May 13, 2021 10:44 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…