Trends

కోహ్లి ఏడు కోట్లు కోరుకుంటే..

కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ లక్షల మందిని వైరస్ బాధితులుగా మారుస్తోంది. రోజూ వేలమంది చనిపోతున్నారు. ఈ సమయంలో బాధితులను ఆదుకోవడానికి, అలాగే నిర్విరామంగా సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేయడానికి సెలబ్రెటీలెందరో ముందుకు వస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. జనాల నుంచి కూడా విరాళాలు స్వీకరిస్తున్నారు.

దేశంలో పరిస్థితులు చూసి చలించిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అయిన అతడి సతీమణి అనుష్క శర్మ కలిసి ఒక ఇనిషియేటివ్ మొదలుపెట్టారు. స్వయంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించి.. కీటో సంస్థతో కలిసి నిధుల సేకరణకు నడుం బిగించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలన్నది వీరి ప్రణాళిక. ఈ మంచి పనికి జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది. 24 గంటల్లో విరాళాల మొత్తం రూ.3.6 కోట్లకు చేరుకుంది.

ఒక్క రోజులో సగం టార్గెట్ అందుకున్నామని, రూ. 7 కోట్ల టార్గెట్‌ను కూడా అందుకుంటామని మొన్న కోహ్లి ట్వీట్ చేశాడు. ఐతే రెండు రోజులు తిరిగేసరికి టార్గెట్ మొత్తాన్ని దాటిపోయి విరాళాల మొత్తం రూ.11 కోట్లకు చేరిపోవడం విశేషం. సామాన్య జనం రూ.4 కోట్ల దాకా విరాళాలు అందజేయగా.. కోహ్లి, అనుష్క అందించిన మొత్తంతో కలిపి రూ.6 కోట్ల మార్కును టచ్ చేసింది ఫండ్.

ఐతే ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ విరుష్క జోడీ చేస్తున్న మంచి పనికి తోడ్పాటు అందించాలని భావించింది. వాళ్లు ఏకంగా రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో విరుష్కల సహాయ నిధి మొత్తం రూ.11 కోట్లకు వెళ్లిపోయింది. ఎంపీఎల్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పిన కోహ్లి.. రూ.11 కోట్ల మొత్తాన్ని కీటో సంస్థతో కలిసి కొవిడ్ సహాయ చర్యలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించాడు. విరుష్క జోడీని చూసి మరింతమంది సెలబ్రెటీలు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నారు.

This post was last modified on May 13, 2021 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రిషికొండకు బ్లూఫాగ్ తిరిగొచ్చింది!

విశాఖపట్టణంలోని సుందర తీరం రిషికొండ బీచ్ కు తిరిగి బ్లూఫాగ్ గుర్తింపు దక్కింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఈ…

28 minutes ago

కూట‌మి మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌.. ఇప్పుడు సాధ్యమేనా?

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేస్తుందా? లేక‌.. మంత్రివ‌ర్గంలో కూర్పు వ‌ర‌కు ప‌రిమితం అవుతుందా? అంటే..…

2 hours ago

స్టార్ హీరోకు ఆనందాన్నివ్వని బ్లాక్‌బస్టర్

పీకే.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటి. 2014లో వచ్చిన ఈ చిత్రం ఆల్ టైం బ్లాక్…

5 hours ago

ష‌ర్మిలమ్మా.. రాజ‌కీయం ఎక్క‌డ‌మ్మా?!

కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయాలు చేస్తున్నారా? లేక ఎండ వేడిమి త‌ట్టుకోలేక‌.. ఇంటి ప‌ట్టునే ఉంటున్నారా? అంటే..…

6 hours ago

మా వోళ్లే పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసిన్రు: ఎమ్మెల్యే

ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తాజాగా సొంత పార్టీ బీజేపీ నేత‌ల‌పై కా మెంట్లు…

7 hours ago

స‌ల‌హాదారులు కావ‌లెను.. బోర్డు పెట్టిన జ‌గ‌న్‌?

వైసీపీ ఇప్పుడున్న ప‌రిస్థితి నుంచి పైలేవాలంటే.. ఖ‌చ్చితంగా పార్టీని పూర్తిగా జీరో నుంచే మొద‌లు పెట్టాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. 2012లో…

7 hours ago