చేతన్ సకారియా.. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలో ఆగిపోవడానికి ముందు, లీగ్ ఆరంభంలో మార్మోగిన యువ ఆటగాళ్ల పేర్లలో ఇదొకటి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్లో ఈ కుర్రాడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. రెండు మ్యాచుల్లో మూడేసి వికెట్లు పడగొట్టాడు. ప్రతిభావంతులైన లెఫార్ట్ పేసర్లు కరవైన భారత క్రికెట్లో ఈ కుర్రాడు ఆశాకిరణంలా కనిపించాడు. సౌరాష్ట్రాకు చెందిన చేతన్ వయసు 23 ఏళ్లే.
ఐతే ఈ ఐపీఎల్లో మెరుపులు మెరిపించడానికి ముందు చేతన్ పెద్ద విషాదాన్ని చూశాడు. కరోనా వైరస్ సోకి అతడి సోదరుడు మృతి చెందాడు. ఆ సంగతలా ఉంచితే దేశవాళీ సీజన్లో చక్కటి ప్రదర్శన చేసిన చేతన్ ప్రతిభను గుర్తించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్.. ఈ కుర్రాడిని రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ముస్తాక్ అలీ, విజయ్ హజారె ట్రోఫీల్లో చక్కటి ప్రదర్శన చేసి.. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో శ్రమించి లీగ్లోకి అడుగు పెట్టాడు చేతన్.
ఈ సీజన్లో రాయల్స్ తొలి మ్యాచ్ నుంచే తుది జట్టులో చేతన్ను ఆడించగా, తనపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చక్కటి ప్రదర్శన చేశాడు. ఐతే లీగ్ మధ్యలో ఆగిపోయే సమయానికి చేతన్ తండ్రి కాంజీబాయ్ సకారియా కరోనా బారిన పడ్డాడు. టోర్నీ ఆగగానే బబుల్ నుంచి అతను నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. తన సోదరుడు చనిపోయాక ప్రస్తుతం ఇంట్లో తానొక్కడినే సంపాదన పరుడినని, ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులు తన తండ్రి చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆయన్ని కాపాడుకుంటామని రెండు రోజుల కిందట మీడియాకు వివరించాడు చేతన్.
ఐతే అతడి మాటలు నెరవేరలేదు. 42 ఏళ్ల కాంజీబాయ్ కరోనాతో పోరాడి ఓడిపోయాడు. నెలన్నర కిందటే సోదరుడిని కోల్పోయిన చేతన్.. ఇప్పుడు తండ్రినీ దూరం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఆకట్టుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కనిపించిన ఈ యువ ఫాస్ట్బౌలర్.. నెలన్నర వ్యవధిలో సోదరుడిని, తండ్రిని కోల్పోయి ఎంతటి వేదన అనుభవిస్తుంటాడో అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సైతం ఇలాగే కొన్ని రోజుల వ్యవధిలో సోదరి, తల్లిని కరోనా కారణంగా కోల్పోవడం తెలిసిందే. తాజాగా సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి సైతం కరోనాకే బలవడం విచారకరం.
This post was last modified on May 11, 2021 7:23 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…