చేతన్ సకారియా.. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలో ఆగిపోవడానికి ముందు, లీగ్ ఆరంభంలో మార్మోగిన యువ ఆటగాళ్ల పేర్లలో ఇదొకటి. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ ఐపీఎల్లో ఈ కుర్రాడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. రెండు మ్యాచుల్లో మూడేసి వికెట్లు పడగొట్టాడు. ప్రతిభావంతులైన లెఫార్ట్ పేసర్లు కరవైన భారత క్రికెట్లో ఈ కుర్రాడు ఆశాకిరణంలా కనిపించాడు. సౌరాష్ట్రాకు చెందిన చేతన్ వయసు 23 ఏళ్లే.
ఐతే ఈ ఐపీఎల్లో మెరుపులు మెరిపించడానికి ముందు చేతన్ పెద్ద విషాదాన్ని చూశాడు. కరోనా వైరస్ సోకి అతడి సోదరుడు మృతి చెందాడు. ఆ సంగతలా ఉంచితే దేశవాళీ సీజన్లో చక్కటి ప్రదర్శన చేసిన చేతన్ ప్రతిభను గుర్తించి ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్.. ఈ కుర్రాడిని రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. ముస్తాక్ అలీ, విజయ్ హజారె ట్రోఫీల్లో చక్కటి ప్రదర్శన చేసి.. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ కోసం ఎంతో శ్రమించి లీగ్లోకి అడుగు పెట్టాడు చేతన్.
ఈ సీజన్లో రాయల్స్ తొలి మ్యాచ్ నుంచే తుది జట్టులో చేతన్ను ఆడించగా, తనపై జట్టు యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చక్కటి ప్రదర్శన చేశాడు. ఐతే లీగ్ మధ్యలో ఆగిపోయే సమయానికి చేతన్ తండ్రి కాంజీబాయ్ సకారియా కరోనా బారిన పడ్డాడు. టోర్నీ ఆగగానే బబుల్ నుంచి అతను నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. తన సోదరుడు చనిపోయాక ప్రస్తుతం ఇంట్లో తానొక్కడినే సంపాదన పరుడినని, ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బులు తన తండ్రి చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఆయన్ని కాపాడుకుంటామని రెండు రోజుల కిందట మీడియాకు వివరించాడు చేతన్.
ఐతే అతడి మాటలు నెరవేరలేదు. 42 ఏళ్ల కాంజీబాయ్ కరోనాతో పోరాడి ఓడిపోయాడు. నెలన్నర కిందటే సోదరుడిని కోల్పోయిన చేతన్.. ఇప్పుడు తండ్రినీ దూరం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఆకట్టుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కనిపించిన ఈ యువ ఫాస్ట్బౌలర్.. నెలన్నర వ్యవధిలో సోదరుడిని, తండ్రిని కోల్పోయి ఎంతటి వేదన అనుభవిస్తుంటాడో అర్థం చేసుకోవచ్చు. భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సైతం ఇలాగే కొన్ని రోజుల వ్యవధిలో సోదరి, తల్లిని కరోనా కారణంగా కోల్పోవడం తెలిసిందే. తాజాగా సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా తండ్రి సైతం కరోనాకే బలవడం విచారకరం.
This post was last modified on May 11, 2021 7:23 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…