వేద కృష్ణమూర్తి.. భారత మహిళల క్రికెట్ను అనుసరించే వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ ఆల్రౌండ్ క్రికెటర్ భారత్ తరఫున 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. కొంత కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్న వేద.. తన కుటుంబంలో వరుస విషాదాలతో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తోంది. ఆమె కుటుంబంలో జరిగిన ఘోరాలు తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు.
కర్ణాటకలోని కాడూర్లో నివసించే వేద కుటుంబంలో ఒకేసారి పలువురు కరోనా బారిన పడ్డారు. ఆమె తల్లి, తండ్రి, సోదరి, సోదరుడు.. ఇలా వరుసగా ఒక్కొక్కరు కొవిడ్ పాజిటివ్గా తేలారు గత నెలలో. వీరిలో కొందరు కోలుకోగా.. కొందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ముందుగా గత నెల 23న వేద తల్లి కరోనాతో కన్ను మూసింది. అప్పుడు తన సోదరి సైతం ఇబ్బందికర స్థితిలో ఉందని.. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని, తాను కరోనా నెగెటివ్గా తేలానని వేద ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఐతే వేద సోదరి వత్సల కొన్ని రోజులకు కాస్త కోలుకున్నట్లే కనిపించింది. ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని కూడా వార్తలొచ్చాయి. కానీ తర్వాత మళ్లీ తన పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ మీద ఉంటూ చికిత్స పొందుతున్న వత్సలకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమై ఊపిరి ఆడని పరిస్థితుల్లో కన్ను మూసింది. రెండు వారాల కిందటే తన తల్లి చనిపోయిందని, ఇప్పుడు సోదరికి కూడా తన కుటుంబం వీడ్కోలు చెప్పాల్సి రావడంతో తన కుటుంబం, తన ప్రపంచం కుదుపునకు లోనైందని వేద ట్విట్టర్లో పేర్కొంది.
కోవిడ్తో చికిత్స పొందుతూ మరణించడంతో తన తల్లితో పాటు సోదరిని వేద చివరి చూపు కూడా చూసుకోలేకపోయింది. నెల కిందటి వరకు సంతోషంగా ఉన్న వేద కుటుంబంలో ఇప్పుడు రెండు ప్రాణాలు కొవిడ్కు బలికావడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. వీరి పరిస్థితి తెలిసి సన్నిహితులు, శ్రేయోభిలాషులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా దయనీయమే.
This post was last modified on May 7, 2021 3:40 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…