ఏడాది నుంచి ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ఫాంలదే హవా. ఓవైపు సినిమాలతో, మరోవైపు వెబ్ సిరీస్లతో, ఇంకోవైపు టాక్ షోలతో హోరెత్తించేస్తున్నాడు ఓటీటీలు. ఇంతకముందు సెలబ్రెటీల టాక్ షోలంటే టీవీ ఛానెళ్లలోనే చూసేవాళ్లం. కానీ ఓటీటీలు కూడా వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా తమ ఫ్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగు వారి ఓటీటీ ఆహా మంచి దూకుడు మీద ఉంది. వైవా హర్ష, సమంత, రానా హోస్ట్లుగా ఈ సంస్థ టాక్ షోలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీల్లో ఒకటైన.. ఇండియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. నేషనల్ లెవెల్లో ఈ సంస్థ ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. ఆ హోస్ట్ ఎవరో కాదు.. ఇలియానా.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా మంచి స్థాయిని అందుకుని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా హోస్ట్గా అమేజాన్ ప్రైమ్ ఒక టాక్ షోను సిద్ధం చేస్తోందట. ఇందుకోసం ఇలియానాకు భారీ మొత్తంలో పారితోషకం కూడా ఇస్తున్నారట. వివిధ భాషలకు చెందిన సెలబ్రెటీలను ఇలియానా ఇంటర్వ్యూలు చేయనుందట. ప్రైమ్లో ఎన్నో వెబ్ సిరీస్ ఒరిజినల్స్ చూశాం కానీ.. దాన్నుంచి ఇలాంటి టాక్ షో లాంటిది రాలేదు.
ఇలియానా లాంటి ఫేమస్ హీరోయిన్.. నటీనటులను ఇంటర్వ్యూ చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని భావిస్తున్నారు. ఇలియానా కూడా ఈ షో పట్ల చాలా ఎగ్జైటెడ్గానే ఉందట. ఈ మధ్యనే హాట్ స్టార్లో ప్రసారమైన ‘బిగ్ బుల్’తో ప్రేక్షకులను పలకరించిన ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ టాక్ షోను హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో సంతోషంగా ఒప్పుకున్నట్లుంది.
This post was last modified on May 7, 2021 3:41 pm
టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…