ఏడాది నుంచి ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ఫాంలదే హవా. ఓవైపు సినిమాలతో, మరోవైపు వెబ్ సిరీస్లతో, ఇంకోవైపు టాక్ షోలతో హోరెత్తించేస్తున్నాడు ఓటీటీలు. ఇంతకముందు సెలబ్రెటీల టాక్ షోలంటే టీవీ ఛానెళ్లలోనే చూసేవాళ్లం. కానీ ఓటీటీలు కూడా వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా తమ ఫ్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగు వారి ఓటీటీ ఆహా మంచి దూకుడు మీద ఉంది. వైవా హర్ష, సమంత, రానా హోస్ట్లుగా ఈ సంస్థ టాక్ షోలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీల్లో ఒకటైన.. ఇండియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. నేషనల్ లెవెల్లో ఈ సంస్థ ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. ఆ హోస్ట్ ఎవరో కాదు.. ఇలియానా.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా మంచి స్థాయిని అందుకుని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా హోస్ట్గా అమేజాన్ ప్రైమ్ ఒక టాక్ షోను సిద్ధం చేస్తోందట. ఇందుకోసం ఇలియానాకు భారీ మొత్తంలో పారితోషకం కూడా ఇస్తున్నారట. వివిధ భాషలకు చెందిన సెలబ్రెటీలను ఇలియానా ఇంటర్వ్యూలు చేయనుందట. ప్రైమ్లో ఎన్నో వెబ్ సిరీస్ ఒరిజినల్స్ చూశాం కానీ.. దాన్నుంచి ఇలాంటి టాక్ షో లాంటిది రాలేదు.
ఇలియానా లాంటి ఫేమస్ హీరోయిన్.. నటీనటులను ఇంటర్వ్యూ చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని భావిస్తున్నారు. ఇలియానా కూడా ఈ షో పట్ల చాలా ఎగ్జైటెడ్గానే ఉందట. ఈ మధ్యనే హాట్ స్టార్లో ప్రసారమైన ‘బిగ్ బుల్’తో ప్రేక్షకులను పలకరించిన ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ టాక్ షోను హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో సంతోషంగా ఒప్పుకున్నట్లుంది.
This post was last modified on May 7, 2021 3:41 pm
మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…
దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…
సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…
టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…
ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…
కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప…