ఏడాది నుంచి ఇండియాలో ఓటీటీ ఫ్లాట్ఫాంలదే హవా. ఓవైపు సినిమాలతో, మరోవైపు వెబ్ సిరీస్లతో, ఇంకోవైపు టాక్ షోలతో హోరెత్తించేస్తున్నాడు ఓటీటీలు. ఇంతకముందు సెలబ్రెటీల టాక్ షోలంటే టీవీ ఛానెళ్లలోనే చూసేవాళ్లం. కానీ ఓటీటీలు కూడా వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా తమ ఫ్లాట్ఫామ్స్లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తెలుగు వారి ఓటీటీ ఆహా మంచి దూకుడు మీద ఉంది. వైవా హర్ష, సమంత, రానా హోస్ట్లుగా ఈ సంస్థ టాక్ షోలను ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఓటీటీల్లో ఒకటైన.. ఇండియాలో మాంచి ఫాలోయింగ్ ఉన్న అమేజాన్ ప్రైమ్ కూడా ఈ బాటలోనే నడవబోతోంది. నేషనల్ లెవెల్లో ఈ సంస్థ ఒక పెద్ద టాక్ షోను నడిపించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఒక స్పెషల్ హోస్ట్ను రెడీ చేసినట్లు సమాచారం. ఆ హోస్ట్ ఎవరో కాదు.. ఇలియానా.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయికగా మంచి స్థాయిని అందుకుని దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ఇలియానా హోస్ట్గా అమేజాన్ ప్రైమ్ ఒక టాక్ షోను సిద్ధం చేస్తోందట. ఇందుకోసం ఇలియానాకు భారీ మొత్తంలో పారితోషకం కూడా ఇస్తున్నారట. వివిధ భాషలకు చెందిన సెలబ్రెటీలను ఇలియానా ఇంటర్వ్యూలు చేయనుందట. ప్రైమ్లో ఎన్నో వెబ్ సిరీస్ ఒరిజినల్స్ చూశాం కానీ.. దాన్నుంచి ఇలాంటి టాక్ షో లాంటిది రాలేదు.
ఇలియానా లాంటి ఫేమస్ హీరోయిన్.. నటీనటులను ఇంటర్వ్యూ చేస్తే కచ్చితంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తుందని భావిస్తున్నారు. ఇలియానా కూడా ఈ షో పట్ల చాలా ఎగ్జైటెడ్గానే ఉందట. ఈ మధ్యనే హాట్ స్టార్లో ప్రసారమైన ‘బిగ్ బుల్’తో ప్రేక్షకులను పలకరించిన ఇలియానా చేతిలో పెద్దగా సినిమాలు లేవు. ఈ నేపథ్యంలో ఆమెకు ఈ టాక్ షోను హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో సంతోషంగా ఒప్పుకున్నట్లుంది.
This post was last modified on May 7, 2021 3:41 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…