ఇండియాలో కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో ఇండియన్ ప్రిమియర్ లీగ్కు కూడా సెగ తప్పట్లేదు. ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాడు లివింగ్ స్టోన్ కరోనాకు భయపడి స్వదేశానికి వెళ్లిపోగా.. తన కుటుంబంలో కొందరు కరోనాతో పోరాడుతుండటంతో రవిచంద్రన్ అశ్విన్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. ఇంతలోనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఆండ్రూ టై, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ సైతం కరోనాకు భయపడి లీగ్కు దూరం అయ్యారు.
కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతున్న ఈ సమయంలో ఐపీఎల్ నిర్వహించడం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం లీగ్ యధావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐతే ఐపీఎల్ గురించి అన్నీ ప్రతికూల వార్తలే బయటికి వస్తున్న సమయంలో.. లీగ్లో ఆడుతున్న ఓ ఆటగాడు ఓ సానుకూల వార్తతో మీడియాలోకి వచ్చాడు.ఆ ఆటగాడే ప్యాట్ కమిన్స్.
కోల్కతా నైట్రైడర్స్ ఆటగాడైన ప్యాట్ కమిన్స్.. ఈ కరోనా కల్లోల సమయంలో భారతీయులకు తన వంతుగా సాయపడాలని నిర్ణయించుకున్నాడు. కొవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ దొరక్క అల్లాడుతున్న నేపథ్యంలో ఆ దిశగా సాయపడేందుకు 50 వేల డాలర్లు (దాదాపు రూ.37 లక్షలు) విరాళం ప్రకటించాడు కమిన్స్. ఈ మొత్తాన్ని పీఎం కేర్స్కు అతను అందజేశాడు. తాను చేసింది పెద్ద సాయమేమీ కాదని, కానీ ఈ సమయంలో భారతీయులకు తోడ్పాటు అందించడం తన బాధ్యతగా భావించానని, మరింత మంది ఈ బాటలో నడుస్తారని ఆశిస్తున్నానని కమిన్స్ పేర్కొన్నాడు.
రెండేళ్ల కిందట రూ.15.5 కోట్లతో ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు కమిన్స్. ఐపీఎల్ ద్వారా ఇంత భారీగా ఆర్జిస్తున్న తాను.. అందులోంచి కొంత మొత్తం భారతీయులకు ఇవ్వడానికి ముందుకు రావడం విశేషమే. అతడి బాటలో మరిందరు క్రికెటర్లు పయనిస్తారేమో చూడాలి.
This post was last modified on April 26, 2021 9:25 pm
ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…
ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…
భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…
గుడివాడలో విజయం కోసం నాని నానాపాట్లు పడుతున్నారు. తన అనుచరుల ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రభుత్వంపై వ్యతిరేకతను తగ్గించేందుకు కష్టపడుతున్నారు. కానీ…
స్టార్ డైరెక్టర్లకు శిష్యరికం చేసి గొప్ప దర్శకులుగా ఎదిగిన వాళ్ళను చూస్తూ ఉంటాం. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దగ్గర…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దిశగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కూటమిలో మరింత జోష్ పెరగబోతోంది. ఇప్పటికే విజయం ఖాయమనే ధీమాతో…