ఏడాదికి ఒకసారి ప్రముఖ మీడియా దిగ్గజం ఫోర్బ్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంపన్నుల లెక్క కట్టటం తెలిసిందే. ఏడాదికి ఒకసారి ఈ సంస్థ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకొని మదింపు చేసి.. సంపన్నుల తుది జాబితాను సిద్ధం చేస్తుంది. ఈ ఏడాది రూ.7350 కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని లెక్క కట్టింది. ఇలాంటివారు ప్రపంచ వ్యాప్తంగా 2755 మందిగా తేల్చింది. టాప్ టెన్ జాబితాలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చోటు సంపాదించగా.. భారతీయ వ్యాపార ప్రముఖులు పలువురు జాబితాలో చోటు దక్కించుకున్నారు.
తెలుగురాష్ట్రానికి చెందిన పలువురు కూడా ఈ జాబితాలో చోటు దక్కటం విశేషం. తొలి 200 స్థానాల్లో దేశీయంగా ఏడుగురికి చోటు లభించింది. ఇటీవల కాలంలో ఆస్తుల్ని విపరీతంగా పెంచేసుకుంటున్న గౌతమ్ అదానీ జాబితాలో 24వ స్థానానికి చేరటం గమనార్హం. టాటా.. బిర్లాలను అదానీ.. డిమార్ట్ అధినేతలు దాటేయటం గమనార్హం. అంతేకాదు.. జాబితాలో పలువురు తెలుగు పారిశ్రామిక దిగ్గజాలు చోటు దక్కించుకున్నారు. మెరుగైన ర్యాంకు విషయానికి వస్తే దివి ఫార్మా అధినేత మురళి దివి 384వ ర్యాంకుకు చేరుకున్నారు. తెలుగు వారిలో అత్యంత సంపన్నులుగా తేలింది ఎవరంటే..?
వ్యక్తి పేరు ర్యాంకు సంపద విలువ (బి.డాలర్లలో)
మురళి దివి 384 6.8
రామ్ ప్రసాద్ రెడ్డి 1008 3.0
పీపీ రెడ్డి 1931 1.6
పీవీ క్రిష్ణారెడ్డి 2035 1.5
అపోలో ప్రతాప్ రెడ్డి 2035 1.5
సతీశ్ రెడ్డి 2035 1.5
జీవీ ప్రసాద్ 2378 1.2
ఎం.ఎస్.ఎన్ రెడ్డి 2524 1.1
దేశీయంగా చూస్తే.. (టాప్ 200 ర్యాంకు లోపు)
గౌతమ్ అదానీ 24 50.5
శివ్ నాడార్ 71 23.5
రాధాకిషన్ దమానీ 117 16.5
ఉదయ్ కోటక్ 121 15.9
పల్లోంజీ మిస్త్రీ 140 14.6
కె.ఎం. బిర్లా 168 12.8
సైరస్ పూనావాలా 169 12.7
This post was last modified on April 7, 2021 1:22 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…