Trends

ఒక్క ఓడ ఆగిపోతే ప్రపంచానికి ఇంత నష్టమా?

ప్రపంచం కుగ్రామంగా మారిన తర్వాత.. ఎక్కడో ఏదో జరిగినా.. దాని ప్రభావం ప్రపంచం మీద పడే పరిస్థితి. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఈ విషయాన్ని మరింత బాగా అర్ఱమయ్యేలా చేసింది. ఎక్కడో ఈజిప్టులోని సూయిజ్ కెనాల్ లో షిప్పు అడ్డం తిరిగి.. ఇరుక్కుపోవటం ఏమిటి? దాని కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడటం ఏమిటి? దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరల మీద ఎఫెక్టు పడటం ఏమిటి? యావత్ ప్రపంచం గొలుసు కట్టుగా మారిన ఈ రోజుల్లో ఎక్కడ.. ఏ పూసకు తేడా కొట్టినా దాని ప్రభావం అందరి మీదా పడే దుస్థితి నేడు నెలకొంది.

కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. కెనాల్ లో భారీ షిప్పుడు అడ్డం తిరిగి ఆగిపోవటం.. వెనుక నున్న భారీ షిప్పులు ముందుకు వెళ్లలేక నిలిచిపోయాయి. షిప్పుకు రెండు వైపులా పెద్ద ఎత్తున నిలిచిపోవటంతో మొత్తం ట్రాఫిక్కు స్తంభించిపోయింది. ప్రపంచ వ్యాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ప్రతి రోజు పదిలక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అయ్యేది ఈ కెనాల్ ద్వారానే.

ప్రస్తుతం షిప్పు ఇరుక్కున్న కారణంగా ప్రతి గంటకు జరుగుతున్న నష్టం రూ.3వేల కోట్లుగా లెక్కేశారు నిపుణులు. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ భారీ నౌక.. సూయజ్ నగర సమీపంలోని సూయజ్ కాలువ ముఖ ద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ ఘటన జరిగి 36 గంటలు అయ్యింది. నౌకను తిప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రోజుకు కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో.. ప్రస్తుతం చిన్నా.. పెద్దా అన్ని కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి.

ఈ ఆగిపోయిన చోటే సౌదీ.. రష్యన్.. ఒమన్.. యూఎస్ ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదల్లేని పరిస్థితి. ఇదే పరిస్థితి మరింత కాలం కొనసాగితే.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల మీద ప్రభావం పడటమే కాదు.. ధరలు పెరిగే ఛాన్సు ఉంది. అదే జరిగితే.. ప్రపంచంలోని ప్రతిమూల ఉన్నోడి మీద కూడా భారం పడే వీలుందని చెబుతున్నారు.

This post was last modified on March 26, 2021 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

28 minutes ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

37 minutes ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

52 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

1 hour ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

1 hour ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

1 hour ago