ప్రపంచ మగాళ్లందరికి హెచ్చరిక. మహా అయితే మరో పాతికేళ్లు. అప్పటికే మగాళ్ల ఆయువు మీద దెబ్బ పడే దారుణ వైనాన్ని వెల్లడించిందో నివేదిక. సంచలనంగా మాత్రమే కాదు షాకింగ్ గా మారిన ఈ అధ్యయనంలోని వివరాలు తెలిస్తే అవాక్కు అవ్వటమే కాదు.. మగాళ్లంతా వణికిపోవటం ఖాయం. ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా మానవజాతి ఫలదీకరణ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతున్నట్లు గుర్తించారు.
అనునిత్యం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న పలు రసాయనాల కారణంగా క్రమంగా మగాళ్లలోని వీర్యకణాల సంఖ్య తగ్గేందుకు.. అంగ పరిమాణం కుంచించుకుపోయేందుకు కారణమవుతుందని హెచ్చరించారు. కౌంట్ డౌన్ పేరుతో తాజాగా విడుదల చేసిన పుస్తకాన్ని షన్నా స్వాన్ అనే ఎన్విరానమెంటల్ ఎమిడమాలజిస్టు వెల్లడించారు. ఈ పుస్తకం చెప్పిన దాని ప్రకారం 1973తో పోలిస్తే ఇప్పటికి.. మగాళ్లలో వీర్య కణాల సంఖ్య 60 శాతం మేర తగ్గిందని.. ఇదే తరహా సాగితే 2045 నాటికి స్పెర్మ్ కౌంట్ జీరోకు చేరుతుందని హెచ్చరించారు.
అదే వాస్తవరూపం దాలిస్తే.. ఫ్యూచర్ లో మానవ ప్రత్యుత్పత్తే ఉండదన్న షాకింగ్ నిజం వెల్లడైంది. ఈ విపత్తుకు కారణం రోజువాడే వస్తువుల్లోని రసాయనాలే అని చెబుతున్నారు. ఫుడ్ ర్యాపింగ్స్ మొదలు ప్లాస్టిక్ కంటైనర్లు.. రోజువారీ వాడే డియోడరెంట్లు.. సబ్బులు.. ఇలా అన్నింటిలోనూ ఉండే ప్రమాదకరమైన రసాయనాలు మగాళ్ల కొంప ముంచనున్నాయని చెబుతున్నారు.
చాలా వస్తువుల్లో వాడే పీఎఫ్ఏఎస్ గా పిలిచే ఫరెవర్ కెమికల్స్ ప్రకృతిలో బ్రేక్డౌన్ కావని.. ఇవి శరీరంలో అలా ఉండిపోతాయని చెబుతున్నారు. ఇవి పేరుకుపోయే కొద్దీ.. హార్మోన్ల అసమతుల్యత పెరుగుతోందని చెబుతున్నారు. అయితే.. ఈ రసాయనాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా ఒకేలా లేదంటున్నారు. కొన్ని దేశాల్లో పూర్తిగా బ్యాన్ చేస్తే.. మరికొన్ని దేశాల్లో అంతలా లేదంటున్నారు. ఈ రసాయనాల కారణంగా మగవారి అంగ పరిణామం.. వృషణాల్లో ఘనపరిమాణం కూడా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. మరి.. ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటాయో లేదో?
This post was last modified on March 21, 2021 8:51 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…