దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది. బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనను ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆమె చెప్పలేకపోతోంది.
బాత్రూంకు వెళ్లాలని చెప్పి.. మృగాళ్ల నుంచి తాను తప్పించుకున్నట్లుగా ఆమె చెబుతోంది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకుంటే తీవ్రంగా కొట్టేవారని.. దారుణమైన హింసకు గురి చేసేవారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
This post was last modified on March 6, 2021 11:10 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…