దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది. బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనను ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆమె చెప్పలేకపోతోంది.
బాత్రూంకు వెళ్లాలని చెప్పి.. మృగాళ్ల నుంచి తాను తప్పించుకున్నట్లుగా ఆమె చెబుతోంది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకుంటే తీవ్రంగా కొట్టేవారని.. దారుణమైన హింసకు గురి చేసేవారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
This post was last modified on March 6, 2021 11:10 am
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…