దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది. బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనను ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆమె చెప్పలేకపోతోంది.
బాత్రూంకు వెళ్లాలని చెప్పి.. మృగాళ్ల నుంచి తాను తప్పించుకున్నట్లుగా ఆమె చెబుతోంది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకుంటే తీవ్రంగా కొట్టేవారని.. దారుణమైన హింసకు గురి చేసేవారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
This post was last modified on March 6, 2021 11:10 am
నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…
కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…
అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…