దారుణమైన ఘోరం బయటకు వచ్చింది. విన్నంతనే ఒళ్లు జలదరించే అమానవీయమైన వైనం తాజాగా వెలుగు చూసి సంచలనంగా మారింది. మగాళ్లు మృగాళ్లుగా మారిన.. ఒక అబలపై నెలరోజుల పాటు 60 మంది జరిపిన అత్యాచార ఉదంతం తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సరాయ్ కేలా – ఖర్ సావా జిల్లాలోని కందర్ బేరా సమీపంలోని గ్యారేజ్ లో తనను బంధించినట్లుగా ఆమె పోలీసులకు చెప్పింది. బాధితురాలు తీవ్రమైన అనారోగ్యంతో ఉందని.. సరిగా మాట్లాడలేకపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తనను ఎప్పుడు కిడ్నాప్ చేసింది ఆమె చెప్పలేకపోతోంది.
బాత్రూంకు వెళ్లాలని చెప్పి.. మృగాళ్ల నుంచి తాను తప్పించుకున్నట్లుగా ఆమె చెబుతోంది. తనకు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యం చేసేవారని.. మాట వినకుంటే తీవ్రంగా కొట్టేవారని.. దారుణమైన హింసకు గురి చేసేవారని ఆమె వెల్లడించింది. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. వైద్య సేవల్ని అందిస్తున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. కేసును నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
This post was last modified on March 6, 2021 11:10 am
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు నాకు గురువని ఎవడన్నాడు. బుద్ధి…
ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…
మలయాళంలో గత దశాబ్ద కాలంలో తిరుగులేని పాపులారిటీ సంపాదించిన నటుడు ఫాహద్ ఫాజిల్. లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ తనయుడైన ఫాహద్…
సోషల్ మీడియా, టీవీ ఛానల్స్ పెరిగిపోయాక అనుకరణలు, ట్రోలింగ్ లు విపరీతంగా పెరిగిపోయాయి. త్వరగా వచ్చే పాపులారిటీ కావడంతో ఎలాంటి…