ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ భవనం ఎదుట.. పోలీసు అధికారి ఒకరు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. యూపీ అసెంబ్లీ గేటు నెంబరు ఏడు వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.
యూపీకి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే.. యూపీ అసెంబ్లీ వద్దకు వచ్చారు. అక్కడి ఏడో నెంబరు గేటు వద్ద నిలుచున్న ఆయన.. తన సర్వీసు రివాల్వర్ తో తనను తాను కాల్చేసుకున్నారు. దీంతో.. అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన.. ఘటనాస్థలంలోనే మరణించారు. పెద్ద మోత రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ తిన్నారు.
అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను మరణించిన వైనాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్య చేసుకున్న చోట.. అతను రాసుకున్న సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ‘‘నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగుల్ని చూడండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును షురూ చేశారు. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
This post was last modified on March 5, 2021 11:38 am
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…