ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఉదంతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు కుదిపేస్తుంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ భవనం ఎదుట.. పోలీసు అధికారి ఒకరు సూసైడ్ చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు యూపీలో సంచలనంగా మారింది. యూపీ అసెంబ్లీ గేటు నెంబరు ఏడు వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది.
యూపీకి చెందిన సబ్ ఇన్ స్పెక్టర్ నిర్మల్ కుమార్ చౌబే.. యూపీ అసెంబ్లీ వద్దకు వచ్చారు. అక్కడి ఏడో నెంబరు గేటు వద్ద నిలుచున్న ఆయన.. తన సర్వీసు రివాల్వర్ తో తనను తాను కాల్చేసుకున్నారు. దీంతో.. అక్కడికక్కడే కుప్పకూలిన ఆయన.. ఘటనాస్థలంలోనే మరణించారు. పెద్ద మోత రావడంతో అక్కడి భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పోలీసు అధికారి ఒకరు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ తిన్నారు.
అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అతను మరణించిన వైనాన్ని వైద్యులు ధ్రువీకరించారు. ఆత్మహత్య చేసుకున్న చోట.. అతను రాసుకున్న సూసైడ్ నోట్ ను పోలీసులు గుర్తించారు. ‘‘నేను వెళ్లిపోతున్నాను. నా పిల్లల బాగోగుల్ని చూడండి’’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఎస్ఐ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తును షురూ చేశారు. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
This post was last modified on March 5, 2021 11:38 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…