Trends

కేసు ఓడిపోయిన నీరవ్ మోడీ.. భారత్‌కు రాక తప్పదు


భారత బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం.. అక్కడి కోర్టులకు ఏవేవో కారణాలు చెప్పి కేసులను సాగదీయడం.. ఇండియాకు చిక్కకుండా తప్పించుకోవడం.. ఇదీ కొందరు ఘరానా మోసగాళ్ల తీరు. ఈ విషయంలో విజయ్ మాల్యా దారి చూపిస్తే అతణ్ని అనుసరిస్తూ మరో వైట్ కాలర్ మోసగాడు నీరవ్ మోదీ కొన్నేళ్ల కింద బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి యూకేకు పారిపోయి అక్కడే కాలం గడుపుతున్న సంగతి తెలిసిందే.

ఐతే ఎట్టకేలకు నీరవ్ మోడీ పాపం పండింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్‌ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్‌ కోర్టు తీర్పు వెలువరించింది. తనను భారత్‌కు అప్పగిస్తే అన్యాయం జరుగుతుందన్న నీరవ్ వాదనతో కోర్టు విభేదించింది. అలాగే నీరవ్‌ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టి పారేసింది.

పీఎన్‌బీకి రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో నీర‌వ్ మోడీపై గురువారం లండ‌న్ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఆ కేసులో నీర‌వ్ మోదీని దోషిగా తేల్చేందుకు కావాల్సిన అన్ని ఆధారాలు ఉన్న‌ట్లు న్యాయ‌మూర్తి శామ్యూల్స్ స్పష్టం చేశారు. నీర‌వ్‌కు వ్య‌తిరేకంగా భార‌త్ త‌మ‌కు 16 సంపుటాల ఆధారాల‌ను స‌మ‌ర్పించింద‌ని.. వాటిని గుర్తిస్తున్నామని జడ్జి పేర్కొన్నారు. ఈ కేసు రెండున్న‌ర ఏళ్లుగా లండన్ కోర్టులో విచార‌ణలో ఉంది.

వాండ్స్‌వ‌ర్త్ జైలు నుంచి అత‌ను ఇవాళ వెస్ట్‌మినిస్ట‌ర్ మెజిస్ట్రేట్‌ కోర్టు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యాడు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును యూకే హోంశాఖ మంత్రి ప్రీతిపాటిల్‌కు తెలియ‌జేయ‌నున్నారు. పీఎన్‌బీకి కోట్లు ఎగ‌వేసిన కేసులో నీర‌వ్‌ను అప్ప‌గించాల‌ని బ్రిట‌న్‌ను భార‌త్ కోరుతున్న విష‌యం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో త్వరలోనే నీరవ్ మోడీ భారత్‌లో అడుగు పెట్టక తప్పదని భావిస్తున్నారు. ఇదే తరహాలో విజయ్ మాల్యాను కూడా యూకే నుంచి ఇండియాకు రప్పించాలని భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. అతను 9 వేల కోట్లకు పైగా బ్యాంకులకు ఎగ్గొట్టి యూకే పారిపోయిన సంగతి తెలిసిందే.

This post was last modified on February 25, 2021 6:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

2 hours ago

సత్యతో పోలికలు సబబు కాదు

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…

4 hours ago

ఒక్క ఎపిసోడుతో హాట్ టాపిక్ అయ్యింది

ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…

4 hours ago

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

5 hours ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

6 hours ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

7 hours ago