ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అతను అద్భుతం చేశాడు. ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు. ఈ సాహస గాథకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.
కర్ణాటకకు చెందిన రాజ గోపాల్ నాయక్.. తన భార్య, కూతురితో కలిసి బెండెకెరె అనే పల్లెటూరిలో ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన చిరుత.. ఎగిరి వీరి మీదికి దూకింది. ఆ దెబ్బతో భార్య, కూతురితో కలిసి బండి మీది నుంచి కింద పడ్డాడు రాజగోపాల్. చిరుత మళ్లీ వీరి మీదికి దూసుకురావడంతో రాజగోపాల్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని విడిచిపెడితే భార్య, బిడ్డ తనకు దక్కరని తన ప్రాణం పోయినా పర్లేదు దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే.. చిరుతతో కలబడ్డాడు. 20 నిమిషాల పాటు దాంతో అసాధారణ రీతిలో పోరాడాడు. ఈ క్రమంలో చిరుత అతణ్ని తీవ్రంగా గాయపరిచింది. అయినా తట్టుకుని ఒట్టి చేతులతో దాన్ని చంపేశాడు.
ఈలోపు సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రక్తమోడుతూ.. చచ్చి పడి ఉన్న చిరుత ముందు కూర్చుని ఉండటం చూసి షాకైపోయారు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. భార్య, బిడ్డ కోసం రాజగోపాల్ చేసిన సాహసానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అతణ్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-2’లో కుటుంబం కోసం అసాధారణ సాహసం చేసే జార్జి కుట్టితో రాజగోపాల్ను పోలుస్తున్నారు.
This post was last modified on February 24, 2021 4:51 pm
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…
పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి,…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…