ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అతను అద్భుతం చేశాడు. ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు. ఈ సాహస గాథకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.
కర్ణాటకకు చెందిన రాజ గోపాల్ నాయక్.. తన భార్య, కూతురితో కలిసి బెండెకెరె అనే పల్లెటూరిలో ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన చిరుత.. ఎగిరి వీరి మీదికి దూకింది. ఆ దెబ్బతో భార్య, కూతురితో కలిసి బండి మీది నుంచి కింద పడ్డాడు రాజగోపాల్. చిరుత మళ్లీ వీరి మీదికి దూసుకురావడంతో రాజగోపాల్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని విడిచిపెడితే భార్య, బిడ్డ తనకు దక్కరని తన ప్రాణం పోయినా పర్లేదు దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే.. చిరుతతో కలబడ్డాడు. 20 నిమిషాల పాటు దాంతో అసాధారణ రీతిలో పోరాడాడు. ఈ క్రమంలో చిరుత అతణ్ని తీవ్రంగా గాయపరిచింది. అయినా తట్టుకుని ఒట్టి చేతులతో దాన్ని చంపేశాడు.
ఈలోపు సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రక్తమోడుతూ.. చచ్చి పడి ఉన్న చిరుత ముందు కూర్చుని ఉండటం చూసి షాకైపోయారు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. భార్య, బిడ్డ కోసం రాజగోపాల్ చేసిన సాహసానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అతణ్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-2’లో కుటుంబం కోసం అసాధారణ సాహసం చేసే జార్జి కుట్టితో రాజగోపాల్ను పోలుస్తున్నారు.
This post was last modified on February 24, 2021 4:51 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…