ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అతను అద్భుతం చేశాడు. ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు. ఈ సాహస గాథకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.
కర్ణాటకకు చెందిన రాజ గోపాల్ నాయక్.. తన భార్య, కూతురితో కలిసి బెండెకెరె అనే పల్లెటూరిలో ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన చిరుత.. ఎగిరి వీరి మీదికి దూకింది. ఆ దెబ్బతో భార్య, కూతురితో కలిసి బండి మీది నుంచి కింద పడ్డాడు రాజగోపాల్. చిరుత మళ్లీ వీరి మీదికి దూసుకురావడంతో రాజగోపాల్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని విడిచిపెడితే భార్య, బిడ్డ తనకు దక్కరని తన ప్రాణం పోయినా పర్లేదు దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే.. చిరుతతో కలబడ్డాడు. 20 నిమిషాల పాటు దాంతో అసాధారణ రీతిలో పోరాడాడు. ఈ క్రమంలో చిరుత అతణ్ని తీవ్రంగా గాయపరిచింది. అయినా తట్టుకుని ఒట్టి చేతులతో దాన్ని చంపేశాడు.
ఈలోపు సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రక్తమోడుతూ.. చచ్చి పడి ఉన్న చిరుత ముందు కూర్చుని ఉండటం చూసి షాకైపోయారు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. భార్య, బిడ్డ కోసం రాజగోపాల్ చేసిన సాహసానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అతణ్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-2’లో కుటుంబం కోసం అసాధారణ సాహసం చేసే జార్జి కుట్టితో రాజగోపాల్ను పోలుస్తున్నారు.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…