Trends

ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు


ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా పిల్లల్ని కాపాడుకునే క్రమంలో అతను అద్భుతం చేశాడు. ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు. ఈ సాహస గాథకు సంబంధించిన వివరాలేంటో చూద్దాం పదండి.

కర్ణాటకకు చెందిన రాజ గోపాల్ నాయక్.. తన భార్య, కూతురితో కలిసి బెండెకెరె అనే పల్లెటూరిలో ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా.. పక్కనున్న అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన చిరుత.. ఎగిరి వీరి మీదికి దూకింది. ఆ దెబ్బతో భార్య, కూతురితో కలిసి బండి మీది నుంచి కింద పడ్డాడు రాజగోపాల్. చిరుత మళ్లీ వీరి మీదికి దూసుకురావడంతో రాజగోపాల్ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. దాన్ని విడిచిపెడితే భార్య, బిడ్డ తనకు దక్కరని తన ప్రాణం పోయినా పర్లేదు దాంతో పోరాడాలని నిర్ణయించుకున్నాడు. చేతిలో ఏ ఆయుధం లేకపోయినా సరే.. చిరుతతో కలబడ్డాడు. 20 నిమిషాల పాటు దాంతో అసాధారణ రీతిలో పోరాడాడు. ఈ క్రమంలో చిరుత అతణ్ని తీవ్రంగా గాయపరిచింది. అయినా తట్టుకుని ఒట్టి చేతులతో దాన్ని చంపేశాడు.

ఈలోపు సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. రాజగోపాల్ రక్తమోడుతూ.. చచ్చి పడి ఉన్న చిరుత ముందు కూర్చుని ఉండటం చూసి షాకైపోయారు. ఇదెలా సాధ్యమైందో అర్థం కాక అయోమయంలో పడ్డారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. భార్య, బిడ్డ కోసం రాజగోపాల్ చేసిన సాహసానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. అతణ్ని రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఈ మధ్యే రిలీజైన ‘దృశ్యం-2’లో కుటుంబం కోసం అసాధారణ సాహసం చేసే జార్జి కుట్టితో రాజగోపాల్‌ను పోలుస్తున్నారు.

This post was last modified on February 24, 2021 4:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోహన్ లాల్ ‘వృషభ’కు గీత సంస్థ చేయూత

రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…

32 minutes ago

శివంగిగా మారిన శివన్న… చాలా విచిత్రంగా ఉందే

శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…

2 hours ago

మొన్న టీచర్లు.. నేడు పోలీసులు.. ఏపీలో కొలువుల జాతర

ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…

4 hours ago

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

5 hours ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

5 hours ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

6 hours ago