ఇటీవల కాలంలో మరే న్యాయమూర్తి ఆదేశాలు చర్చకు రానంత ఎక్కువగా ఒక కేసు విషయంలో మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటమేకాదు.. కొత్త చర్చకు తెర తీసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించే క్రమంలో జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలపై పెద్ద రగడే చోటుచేసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే.
శరీరాన్ని శరీరం తాకలేదు కాబట్టి.. నేరంగా పరిగణించలేమని.. లైంగిక వేధింపులకు గురైనట్లు కాదని ఆమె వ్యాఖ్యానించటం సంచలనంగా మారటం తెలిసిందే. .ఐదేళ్ల బాలిక చేతులు కట్టేసి ప్యాంట్ జిప్పు తెరిచినా అదేమీ నేరం కాదంటూ ఆమె ఇచ్చిన తీర్పు.. ఆమె ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. ఈ వివాదాస్పద తీర్పును వెల్లడించిన దానికి తగ్గట్లే ఆమె తగ్గ మూల్యం చెల్లించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టింది. ఇదిలా ఉండగా.. జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అహ్మదాబాద్ కు చెందిన రాజకీయ విశ్లేషకురాలు దేవ్ శ్రీ త్రివేది తాజాగా కొన్ని కండోమ్ ప్యాకెట్లను పంపారు. అంతేకాదు.. ముంబయిలోని మరో 12 ప్రాంతాలకు ఆమె కండోమ్ ప్యాక్ లు పంపటం సంచలనంగా మారింది. పుష్ప గనేడివాలా తీర్పుతో ఒక మైనర్ బాలికకు న్యాయం జరగలేదని వాపోయారు.
ఆమె తీర్పుపై తన నిరసన వ్యక్తం చేసేందుకు తాను కండోమ్ పాకెట్లు పంపినట్లుగా ఆమె చెప్పారు. ఒక మహిళగా తానుచేసిన పనికి చింతించటం లేదన్నారు. జస్టిస్ గనేడివాలా లాంటి వారి కారణంగా మగాళ్లు మరింత రెచ్చిపోతారని.. ఇకపై అత్యాచారాలు స్త్రీల దుస్తులపైనే జరుగుతాయన్నారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. న్యాయమూర్తికి కండోమ్ పాకెట్లు పంపిన ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on February 18, 2021 3:17 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…