కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాను ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో మరే దేశానికి జరగనంత నష్టం ఆ దేశానికి జరిగింది.. ఇంకా జరుగుతూనే ఉంది కూడా. ఇప్పటికి ఆ దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతూనే ఉన్నాయి. అమెరికా చరిత్రలో భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన దరిద్రపు గొట్టు రికార్డు కరోనా సొంతం చేసుకుంది. దీని పుణ్యమా అని అమెరికాలో వేలాది మంది తమ ఉద్యోగాల్ని పోగొట్టుకున్నారు.
అలాంటి వారిలో మిషెల్ వోల్ కెర్ట్ అనే మహిళ కూడా ఉన్నారు. కరోనా కారణంగా గత జులైలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఆమె.. తనలా జాబ్ పోగొట్టుకున్న వారిని ఫేస్ బుక్ లో కలుసుకొని వారి కష్టాల గురించి తెలుసుకున్నారు. వారికి సంబంధించిన అంశాల్ని అధ్యక్షుల వారికి తెలియజేయాలని భావించారు. ఇటీవల ఆమె ఒక లేఖ రాశారు. అది కాస్తా.. జో బైడెన్ వద్దకు చేరటం.. ఆయన స్వయంగా మిషెల్ కు ఫోన్ చేశారు. ప్రతి వారంతంలో నిర్వహించే వీక్లీ కాన్వర్సేషన్స్ లో భాగంగా ఆమెకు ఫోన్ చేశారు.
తాను లేఖ చదివానని.. తనను కదిలించినట్లుగా ఆయన చెప్పారు. తాను పని చేస్తున్న కంపెనీలో చాలామందిని తీసేశారని.. తాను కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకున్న విషయాన్ని ఆమె బైడెన్ కు చెప్పారు. ప్రస్తుత సమయంలో ఉద్యోగాన్ని వెతుక్కోవటం ఎంతో కష్టంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా బైడెన్ తన తండ్రి తనకు చెప్పిన ఒక విషయాన్ని పంచుకున్నారు. ఉద్యోగం అంటే.. కేవలం జీతం మాత్రమే కాదని.. ఉద్యోగం అంటే ఒక గౌరవం.. మర్యాద అని.. సమాజంలో ఒకరి స్థానం ఏమిటో చెప్పేది ఉద్యోగమేనని తనతో చెప్పేవారన్నారు. దీనికి స్పందించిన సదరు మహిళ.. బైడెన్ తండ్రి మాటలు తననెంతో కదిలించాయన్నారు.
ఈ సందర్భంగా కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి.. అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడించారు. బైడెన్ తనకు నేరుగా ఫోన్ చేయటంపై ఆమె అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఆదుకుంటున్నట్లుగా ఆయన చెప్పారు. రానున్న వంద రోజుల్లో పది కోట్ల మందికి వ్యాక్సిన్ డోస్ వేయనున్నట్లుగా బైడెన్ చెప్పగా.. తన తల్లిదండ్రులకు ఈ రోజునే వ్యాక్సిన్ వేయిస్తున్నట్లు చెప్పారు. అధ్యక్షుల వారు ఫోన్ చేసిన రోజునే వ్యాక్సిన్ అపాయింట్ మెంట్ దొరికినట్లు చెప్పగా.. బైడెన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
చివరకు తన కుమార్తెతో మాట్లాడతారా? అని అడిగిన మహిళకు ఓకే చెప్పిన బైడెన్ మాట్లాడారు. ఆ సందర్భంగా మిషెల్ ధైర్యం.. డెడికేషన్ .. ఉద్యోగం చేయాలన్న తపన తనకు ఎంతో నచ్చినట్లుగా బైడెన్ పేర్కొన్నారు. ఈ సంభాషణ మొత్తాన్ని రెండు వైపులా షూట్ చేసి.. ఎడిట్ చేసిన వీడియోను వైట్ హౌస్ విడుదల చేసింది. ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా ఇలాంటి పనులు చేసినా.. అధ్యక్షుల వారి మాటలు ఎంతోమంది అమెరికన్లకు సాంత్వనగా మారతాయని చెప్పక తప్పదు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…