కరోనా టీకా గురించి అందరికి తెలిసిందే. తొలుత ఒక డోస్ ఇస్తారు. నెల రోజుల తర్వాత మరో డోస్ ఇస్తారు. తొలుత తీసుకున్న కంపెనీకి సంబంధించిన డోస్ నే రెండో దఫా తీసుకోవాలి. అలాంటిది అందుకు భిన్నంగా ఐదుగురికి ఇవ్వాల్సిన డోస్ ను ఒకరికే ఇచ్చేస్తే? విన్నంతనే గుండెలు అదిరిపోయేలా ఉన్న ఈ పరిణామం సింగపూర్ లో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన నేషనల్ ఐ సెంటర్ లోని సిబ్బంది ఒకరికి పొరపాటున ఐదు ఫైజర్ టీకా డోసుల్ని ఇచ్చేశారు. జనవరి రెండో వారంలో జరిగిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
ప్రోటోకాల్ ప్రకారం ఫైజర్ టీకాను డైల్యూట్ చేసి.. దాని తీవ్రతను ఐదో వంతుకు తగ్గించిన తర్వాత టీకా ఇవ్వాలి. అయితే.. టీకాను డైల్యూట్ చేసే పని ప్రారంభించిన సిబ్బంది.. మరో పనిలోకి వెళ్లటం.. డైల్యూట్ అయ్యిందన్న ఉద్దేశంతో పోరపాటుగా.. టీకాను నేరుగా ఇచ్చేశారు. అంటే.. ఒక డోసుకు బదులుగా ఐదు డోసులు ఇచ్చారన్న మాట. జరిగిన తప్పిదాన్ని సిబ్బంది వెంటనే గుర్తించారు.
వెంటనే.. తాము చేసిన తప్పును సీనియర్ వైద్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన వారు.. సదరు వ్యక్తిని పరిశీలించారు. పరీక్షలు జరిపారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో.. అతన్ని రెండు రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. అయినప్పటికి ఎలాంటి అనారోగ్యం లేదని తేల్చిన తర్వాత.. అతడ్ని డిశ్చార్జి చేశారు.
డిసెంబరు 30న సింగపూర్ లో టీకా కార్యక్రమాన్ని షురూ చేశారు. అనుకున్న ప్రకారం సాగితే.. ఈ ఏడాది చివరికి ప్రజలందరికి టీకా అందుతుందని భావిస్తున్నారు. ఏమైనా.. ఐదుగురికి వేసే టీకా.. ఒకరికే వేయటం.. దాని కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవటం.. లక్కీగా భావిస్తున్నారు.
This post was last modified on February 8, 2021 11:00 am
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న, ఎంతగానో కోరుకున్న సందర్భం రానే వచ్చింది. ఆయనకు మనవడు పుట్టాడు. చిరంజీవి కుటుంబంలో…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…