ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. తీరా వ్యాక్సిన్ తయారైందంటే వేసుకోవటానికి భయపడుతున్నారు. నిజంగా కరోనా వైరస్ నేపధ్యంలో పరిస్ధితులు చాలా విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా ప్రాణభయమే, వేసుకున్నా ప్రాణభయమే అన్నట్లుగా తయారైంది పరిస్దితులు. ఇక్కడ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వదిలేసినా మనదేశంలో ప్రస్తుతం రెండు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
మొదటిదేమో పూణె కంపెనీలో తయారైన కోవీషీల్డ్. ఇక రెండోదేమో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీలో తయారైన కోవాగ్జిన్. అయితే మెజారిటి జనాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవటానికి రెడీ అంటున్నారే కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దంటే వద్దంటున్నారట. కేంద్రప్రభుత్వం మాత్రం రెండు రకాల వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఎటువంటి షరతులు లేదు. అయితే కో వాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం తమంతట తాము ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్లు ఓ సర్టిఫికేట్ పై సంతకం చేయాలి.
కోవాగ్జిన్ పెట్టిన నిబంధన వల్లే చాలామందికి అనుమానాలు మొదలైపోయాయట. ఇందులో భాగంగానే ముంబాయ్ లోని జేజే హాస్పిటల్ కు కోవాగ్జిన్ వ్యాక్సిన్ చేరి పదిరోజులైంది. ఇఫ్పటికి సుమారు 100 మంది మాత్రమే వేసుకున్నారట. సుమారు వెయ్యిమందికి పైగా పనిచేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతంకన్నా వేసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉందట. కో వాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినా సిబ్బంది మాత్రం ముందుకు రాలేదట.
అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నదో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది తాము కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేశారు. వైద్యుల సంఘం ఇదే విషయమై సమావేశం పెట్టుకుని ఓ తీర్మానం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవటానికి వైద్యులే నిరాకరిస్తున్నారంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్ధితేమిటి ? మొత్తానికి వ్యాక్సిన్ వేసుకోవటంలో ఆలస్యమైనా పర్వాలేదు కానీ కో వాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదని తెగేసి చెబుతుండటమే విచిత్రంగా ఉంది.
This post was last modified on January 27, 2021 11:33 am
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…