ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. తీరా వ్యాక్సిన్ తయారైందంటే వేసుకోవటానికి భయపడుతున్నారు. నిజంగా కరోనా వైరస్ నేపధ్యంలో పరిస్ధితులు చాలా విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా ప్రాణభయమే, వేసుకున్నా ప్రాణభయమే అన్నట్లుగా తయారైంది పరిస్దితులు. ఇక్కడ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వదిలేసినా మనదేశంలో ప్రస్తుతం రెండు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
మొదటిదేమో పూణె కంపెనీలో తయారైన కోవీషీల్డ్. ఇక రెండోదేమో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీలో తయారైన కోవాగ్జిన్. అయితే మెజారిటి జనాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవటానికి రెడీ అంటున్నారే కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దంటే వద్దంటున్నారట. కేంద్రప్రభుత్వం మాత్రం రెండు రకాల వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఎటువంటి షరతులు లేదు. అయితే కో వాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం తమంతట తాము ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్లు ఓ సర్టిఫికేట్ పై సంతకం చేయాలి.
కోవాగ్జిన్ పెట్టిన నిబంధన వల్లే చాలామందికి అనుమానాలు మొదలైపోయాయట. ఇందులో భాగంగానే ముంబాయ్ లోని జేజే హాస్పిటల్ కు కోవాగ్జిన్ వ్యాక్సిన్ చేరి పదిరోజులైంది. ఇఫ్పటికి సుమారు 100 మంది మాత్రమే వేసుకున్నారట. సుమారు వెయ్యిమందికి పైగా పనిచేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతంకన్నా వేసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉందట. కో వాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినా సిబ్బంది మాత్రం ముందుకు రాలేదట.
అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నదో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది తాము కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేశారు. వైద్యుల సంఘం ఇదే విషయమై సమావేశం పెట్టుకుని ఓ తీర్మానం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవటానికి వైద్యులే నిరాకరిస్తున్నారంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్ధితేమిటి ? మొత్తానికి వ్యాక్సిన్ వేసుకోవటంలో ఆలస్యమైనా పర్వాలేదు కానీ కో వాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదని తెగేసి చెబుతుండటమే విచిత్రంగా ఉంది.
This post was last modified on January 27, 2021 11:33 am
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…