ప్రపంచమంతా కరోనా వైరస్ టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసింది. తీరా వ్యాక్సిన్ తయారైందంటే వేసుకోవటానికి భయపడుతున్నారు. నిజంగా కరోనా వైరస్ నేపధ్యంలో పరిస్ధితులు చాలా విచిత్రంగా మారిపోయాయి. వ్యాక్సిన్ వేసుకోకపోయినా ప్రాణభయమే, వేసుకున్నా ప్రాణభయమే అన్నట్లుగా తయారైంది పరిస్దితులు. ఇక్కడ విషయం ఏమిటంటే యావత్ ప్రపంచాన్ని వదిలేసినా మనదేశంలో ప్రస్తుతం రెండు రకాలైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
మొదటిదేమో పూణె కంపెనీలో తయారైన కోవీషీల్డ్. ఇక రెండోదేమో హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీలో తయారైన కోవాగ్జిన్. అయితే మెజారిటి జనాలు కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవటానికి రెడీ అంటున్నారే కానీ కోవాగ్జిన్ మాత్రం వద్దంటే వద్దంటున్నారట. కేంద్రప్రభుత్వం మాత్రం రెండు రకాల వ్యాక్సిన్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ఎటువంటి షరతులు లేదు. అయితే కో వాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం తమంతట తాము ఇష్టపడి వ్యాక్సిన్ వేయించుకుంటున్నట్లు ఓ సర్టిఫికేట్ పై సంతకం చేయాలి.
కోవాగ్జిన్ పెట్టిన నిబంధన వల్లే చాలామందికి అనుమానాలు మొదలైపోయాయట. ఇందులో భాగంగానే ముంబాయ్ లోని జేజే హాస్పిటల్ కు కోవాగ్జిన్ వ్యాక్సిన్ చేరి పదిరోజులైంది. ఇఫ్పటికి సుమారు 100 మంది మాత్రమే వేసుకున్నారట. సుమారు వెయ్యిమందికి పైగా పనిచేసే అంత పెద్ద ఆసుపత్రిలో 10 శాతంకన్నా వేసుకోలేదంటే ఆశ్చర్యంగానే ఉందట. కో వాగ్జిన్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పినా సిబ్బంది మాత్రం ముందుకు రాలేదట.
అలాగే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నదో కొత్తగా చెప్పక్కర్లేదు. అలాంటి ఆసుపత్రిలోని డాక్టర్లు, వైద్య సిబ్బంది తాము కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోమని కరాఖండిగా చెప్పేశారు. వైద్యుల సంఘం ఇదే విషయమై సమావేశం పెట్టుకుని ఓ తీర్మానం చేయటం ఆశ్చర్యంగా ఉంది. అంటే కో వాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకోవటానికి వైద్యులే నిరాకరిస్తున్నారంటే మరి మిగిలిన వాళ్ళ పరిస్ధితేమిటి ? మొత్తానికి వ్యాక్సిన్ వేసుకోవటంలో ఆలస్యమైనా పర్వాలేదు కానీ కో వాగ్జిన్ మాత్రం వేసుకునేది లేదని తెగేసి చెబుతుండటమే విచిత్రంగా ఉంది.
This post was last modified on January 27, 2021 11:33 am
ఏపీ సీఎం చంద్రబాబు మత్స్యకారుల మనసు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన మత్సకార సేవలో కార్యక్రమంలో…
దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర…
ధర్మపురి అరవింద్.. తండ్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్నా తాను మాత్రం బీజేపీలో సొంతంగా ఎంపీ స్థాయికి ఎదిగిన నేత. బీఆర్ఎస్…
యాంకర్గా మొదలై, హీరోయిన్గా తెరపై కనిపించి, ఇప్పుడు నిర్మాతగా మారింది నిహారిక కొణిదెల. ప్రతి దశలోనూ కొత్తగా ట్రై చేస్తూనే…
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…