గత ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సందర్భంగా చర్చనీయాంశం అయిన పేరు.. సురేశ్ రైనాదే. అతనేమీ ఈ టోర్నీలో ఆడలేదు. అయినా చాన్నాళ్ల పాటు వార్తల్లో ఉన్నాడు. టోర్నీ ఆరంభం కాబోతుండగా వ్యక్తిగత కారణాలు చెప్పి అతను స్వదేశానికి వచ్చేయడం సంచలనం రేపింది. అందుకు కారణాలేంటనే విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
అతను తనకు స్పెషల్ సూట్ ఇవ్వనందుకు హర్టయ్యాడని కొందరంటే.. కాదు కాదు మేనత్త హత్యతో కలత చెంది వచ్చేశాడని ఇంకొందరు అన్నారు. మరికొందరేమో కరోనా భయంతోనే అతను వెనుదిరిగినట్లు చెప్పుకున్నారు. ఐతే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీకి, అతడికి మధ్య ఏదో తేడా జరిగిందనే అనుమానాలు బలంగా వినిపించాయి. అసలు కారణం వేరే ఉందని.. రైనా మళ్లీ ఐపీఎల్కు వస్తానన్నా కూడా ఆ ఫ్రాంఛైజీ అంగీకరించలేదని గుసగుసలు వినిపించాయి.
కట్ చేస్తే ఇంకో రెండున్నర నెలల్లో ఐపీఎల్ 14వ సీజన్ జరగబోతోంది. ఇందుకోసం వచ్చే నెలలో మినీ వేలం నిర్వహించనున్నారు. దాని కంటే ముందు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లెవ్వరో, విడిచిపెట్టే ఆటగాళ్లెవరో తేల్చుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆ జాబితా బయటికి రానుంది. కాగా రైనాకు, చెన్నై ఫ్రాంఛైజీకి చెడిన నేపథ్యంలో ఇన్నేళ్ల బంధానికి తెరపడబోతోందని.. రైనాను ఆ సీఎస్కే విడిచిపెట్టనుందని మీడియాలో గట్టి ప్రచారమే జరిగింది.
రైనా ఫామ్ కూడా ఏమంత బాగా లేకపోవడంతో అతడి కోసం రూ.11 కోట్లు పెట్టడం అనవసరం అని కూడా చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తున్నట్లు వార్తలొచ్చాయి. చెన్నైతో రైనాకు కటీఫ్ అయినట్లే అని.. చిన్న తలా అనే పేరు రైనాకు పోయినట్లే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. కానీ తీరా చూస్తే రైనా.. చెన్నైతోనే కొనసాగబోతున్నాడని తేలింది. రైనాను తమ ఫ్రాంఛైజీ అట్టిపెట్టుకోనున్నట్లు సీఎస్కే అధికారి ఒకరు ఒక ఇంగ్లిష్ డైలీకి కన్ఫమ్ చేశాడు. దీంతో కొత్తగా ఇదేం ట్విస్టు అంటూ ఆశ్చర్యపోవడం అభిమానుల వంతవుతోంది.
This post was last modified on January 20, 2021 4:38 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…