ప్రముఖ నేషనల్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లీక్డ్ వాట్సాప్ చాట్ కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పలు సంచలన అంశాలపై వివిధ వ్యక్తులతో అర్నాబ్ చర్చించిన తీరు విస్మయం గొలుపుతోంది. ఏకంగా 500 పేజీలకు పైగా అర్నాబ్కు సంబంధించిన వాట్సాప్ చాట్ బయటికి వచ్చింది. పుల్వామా అటాక్స్ సహా అనేక అంశాలపై అర్నాబ్ జరిపిన సంభాషణ పెద్ద చర్చకే తావిస్తోంది. కేవలం రాజకీయాల గురించే కాక సినిమా సంబంధిత అంశాల గురించి బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నాబ్ జరిపిన సంభాషణ చర్చనీయాంశం అవుతోంది. అందులో భాగమే.. బాలీవుడ్ హీరో హీరోయిన్లు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ల టాపిక్.
కొంత కాలం హృతిక్, కంగనాల మధ్య ఎఫైర్ నడవగా.. ఆ తర్వాత ఇద్దరూ విడిపోవడం, కంగనా తరచుగా అతడి మీద ఆరోపణలు చేయడం కొన్నేళ్లుగా చూస్తున్నదే. ఐతే ఈ వ్యవహారం హృతిక్ అమాయకుడని, కంగనాకు మానసిక వైకల్యం ఉన్నట్లుగా ఉందని ఈ చాట్లో గుప్తా పేర్కొనగా.. ఆమెకు ఎరోటో మేనియా ఉందని అర్నాబ్ వ్యాఖ్యానించాడు. అంటే అర్థమేంటని అడిగితే.. హృతిక్ పట్ల కంగనాకు శృంగార పరమైన మోజుందని అర్నాబ్ పేర్కొన్నాడు. కంగనా కథ ముగియబోతోందని గుప్తా అంటే.. ఆమె హద్దులు దాటిపోయిందని అర్నాబ్ వ్యాఖ్యానించాడు. ఆమెకు పిచ్చెక్కిందని గుప్తా పేర్కొనగా.. ఆమె అంటేనే జనం భయపడిపోతున్నారని అర్నాబ్ అన్నాడు. జనాలు ఆమెను బహిష్కరించే పరిస్థితి వచ్చిందని గుప్తా వ్యాఖ్యానించాడు. నిజానికి అర్నాబ్, కంగనా ఇద్దరూ మోడీ సర్కారుకు అనుకూలురే. ఒకరికొకరు సహకరించుకున్నవారే. అలాంటిది అర్నాబ్.. కంగనా గురించి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
This post was last modified on January 18, 2021 10:59 pm
కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు చిక్కిన కచిడి చేప అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. 25 కిలోల బరువున్న ఈ చేప మార్కెట్లో…
ఫిబ్రవరి ఏడు కోసం అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. గత కొంత కాలంగా గట్టిగా చెప్పుకునే బ్లాక్…
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…