ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ సంస్థలో కీలక వ్యక్తి జైలు పాలు కాబోతున్నాడు. శాంసంగ్ కంపెనీ మాజీ చీఫ్, ప్రస్తుత వైస్ ఛైర్మన్.. దక్షిణ కొరియాకు చెందిన లీ జే యాంగ్కు రెండున్నరేళ్ల జైలు శిక్ష ఖరారైంది. భారీ అవినీతి కేసులో ఆయనకు కోర్టు ఈ శిక్ష విధించింది. లంచాలు, నిధుల దుర్వినియోగం వంటి అభియోగాలు యాంగ్ ఎదుర్కొంటున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో సంచలనం రేపిన శాంసంగ్ అవినీతి కేసు వల్లే రెండేళ్ల క్రితం ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్ హై తన పదవి కోల్సోవాల్సి వచ్చింది. పార్క్ గెన్ అధికారాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు శాంసంగ్ చీఫ్ ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెతో పాటు ఉన్నతాధికారులు చాలామందికి యాంగ్ భారీ స్థఆయిలో లంచాలు ముట్టజెప్పినట్లు అభియోగాలు ఉన్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ, అక్రమాలకు పాల్పడిన తీరు దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో స్మార్ట్ఫోన్లు అమ్మే సంస్థగా శాంసంగ్కు గుర్తింపు ఉంది. ఈ టెక్ కంపెనీ ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా తయారు చేస్తుంది. అవినీతి కేసులో మొదట సియోల్ కోర్టు లీ జే యాంగ్కు అయిదేళ్ల శిక్ష విధించినా.. ఇప్పుడు ఆ శిక్షను సగానికి కుదించారు. త్వరలోనే ఆయన జైలుకు వెళ్లాల్సి ఉంది. దీనిపై ఉన్నత స్థాయి కోర్టులో ఆయన సవాలు చేయనున్నారు.
This post was last modified on January 18, 2021 4:45 pm
గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో కథానాయికగా పరిచయం అయింది ముంబయి భామ భాగ్యశ్రీ బోర్సే. ఆ సినిమాలో ప్రోమోల్లో…
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…