Trends

ఢిల్లీలో మరో ‘నిర్భయ’ ఘటన.. 16 ఏళ్ల బాలికపై…

దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై స్లీపర్‌ బస్సులో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 4 రాత్రి కశ్మీరీ గేట్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. కుటుంబ సభ్యులతో గొడవ నేపథ్యంలో నోయిడాలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. గ్రేటర్‌ నోయిడాలోని పరిచౌక్‌ వద్ద స్లీపర్‌ బస్సు ఎక్కిన బాలికపై డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

బస్సులోని స్లీపర్‌ బెర్త్‌లకు తెరలు ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయటివారికి కనిపించలేదని సమాచారం. అనంతరం బాలికను ఢిల్లీలోని కశ్మీరీ గేట్‌ బస్‌ స్టాండ్‌ వద్ద దింపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌ను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్‌ బస్సును స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాలికపై జరిగిన ఈ దారుణం తీవ్ర కలకలం రేపుతోంది.

This post was last modified on August 31, 2026 12:48 pm

Share

Recent Posts

టార్గెట్ పులివెందుల…

త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల ఇరు పార్టీలకు…

1 hour ago

క‌ల్కి-2 ఇప్పట్లో అయ్యేది కాదు

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో క‌ల్కి-2 ఒక‌టి. 2024లో విడుద‌లైన క‌ల్కి మూవీ ఎంత పెద్ద…

7 hours ago

వెలిగొండ పై రాజకీయం మొదలు పెట్టిన హరీష్ రావు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో సోమ‌వారం సీఎం చంద్ర‌బాబు.. నాలుగు జిల్లాల్లోని 30 మండ‌లాల‌కు మేలు చేసే `పూల సుబ్బయ్య వెలిగొండ`…

7 hours ago

ప్రతిపక్ష నాయకుడి రాజీనామాకు సీఎం డిమాండ్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1000…

8 hours ago

ఆగస్ట్ నెల… టాలీవుడ్ కళకళ

జూన్ ముందు రెండు మూడు నెలలు సరైన సినిమాలు లేక, జనాలు థియేటర్ల వైపు చూడక ఎగ్జిబిటర్లు అల్లాడిపోయారు. మధ్యలో…

8 hours ago

రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హణం వీడింది

రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం వీడింద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 2019లో రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంద‌ని.. అయితే,…

11 hours ago