Trends

ఫ్రీగా టీకాలు 3 కోట్ల మందికే అయితే.. మిగిలినోళ్ల మాటేంది?

కంటికి కనిపించని మహ్మమారి కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ దేశంలోమరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఆరోగ్య కార్యకర్తలు..ఆరోగ్య సిబ్బందికి ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిదశలో దేశ వ్యాప్తంగా మూడు కోట్ల మందికి టీకాలు ఇస్తున్నామని.. అదంతా ఉచితమని పేర్కొన్నారు.

రానున్న కొన్ని నెలల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 30 కోట్ల మందికి టీకాలు ఇవ్వటమే తమ లక్ష్యమని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్ విషయంలో కేంద్రం సన్నద్ధత.. రాష్ట్రాలతో సమన్వయం అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి భారత్ చేపట్టే టీకా కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రోగ్రాంగా అభివర్ణించారు. ప్రభుత్వ.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బంది.. ఆరోగ్య కార్యకర్తలకే తొలిదశలో టీకా వేస్తామన్నారు.

అనంతరం ఫ్రంట్ లైన్ వర్కుర్లుగా సేవలు అందించే పారిశుద్ధ్య కార్మికులు.. భద్రతా దళాలు.. పోలీసులు.. పారా మిలటరీ దళాలు.. హోంగార్డులు.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వలంటీర్లకు తొలిదశలో టీకాలు ఇవ్వనున్నారు.రెండో విడత టీకాలు వేసే సమయానికి మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. టీకాల పని తీరుపై శాస్త్రీయ నిర్దారణకు వచ్చిన తర్వాతే వ్యాక్సినేషన్ కార్యక్రమంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. టీకాల్ని ఉచితంగా మూడు కోట్ల మందికే ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీ మాటల్ని చూస్తుంటే.. మొదటిదశలో టీకా అందించే మూడు కోట్ల మందికే ఉచితంగా ఇవ్వొచ్చని.. మిగిలిన వారి నుంచి పాక్షికంగా డబ్బులువసూలు చేసే కార్యక్రమాన్ని షురూచేయొచ్చన్న మాట వినిపిస్తోంది. అయితే.. కేంద్రం డబ్బులు వసూలు చేసే ప్రోగ్రాం మొదలు పెట్టినా.. కొన్ని రాష్ట్రాలు ఆ ఖర్చును తాము భరించి ప్రజలకు ఫ్రీగా టీకాల్ని అందించే అవకాశం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on January 12, 2021 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago