సినిమా స్టార్ల కొడుకులు ఈజీగానే హీరోలు అయిపోతారు. వాళ్లు కూడా స్టార్లుగా ఎదిగిపోతుంటారు. చాలా కొద్ది మంది మాత్రమే.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక ఇబ్బంది పడటం, సినిమాల నుంచి వైదొలగడం చేస్తుంటారు. ఇక్కడ లుక్స్ ఎలా ఉన్నా.. పెద్దగా టాలెంట్ లేకపోయినా కూడా నడుస్తుంది కానీ.. ఆటల్లో అలా కుదరదు. ముఖ్యంగా క్రికెట్లో స్టార్ ఆటగాళ్ల వారసత్వాన్నందుకుని కెరీర్ ఆరంభించిన వాళ్లలో తమ తండ్రుల స్థాయికి ఎదిగిన వాళ్లు దాదాపుగా కనిపించరు.
దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తనయుడు రోహన్ గవాస్కర్.. భారత్ తరఫున కొన్ని మ్యాచ్లైతే ఆడాడు కానీ.. ఎంతో కాలం జట్టులో ఉండలేకపోయాడు. తర్వాతి తరంలో మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ కూడా తన కొడుకు అర్జున్ తెందుల్కర్ను క్రికెటర్గా నిలబెట్టలేకపోయాడు.
సచిన్ 16 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చేశాడు. టీనేజీలోనే సంచలన ప్రదర్శనలతో ప్రపంచ మేటి ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ 21 ఏళ్లు వచ్చినా కనీసం ముంబయి సీనియర్ జట్టులో సంపాదించలేని స్థితిలో ఉన్నాడు అర్జున్. ఇప్పటిదాకా అతను అండర్-19, అండర్-23 టోర్నీల్లో ముంబయికి ఆడాడు కానీ.. సీనియర్ జట్టులోకి మాత్రం రాలేకపోయాడు.
భారత జట్టులోకి రావడానికి మార్గాలైన రంజీ, విజయ్ హజారె, ముస్తాక్ అలీ లాంటి టోర్నీలో ఆడే అవకాశం సంపాదించలేకపోయాడు. ఐతే ఎట్టకేలకు ముంబయి సీనియర్ జట్టులో అతడికి చోటు లభించింది. ఈ నెల 10 నుంచి మొదలయ్యే ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం ఎంపిక చేసిన ముంబయి జట్టులో అర్జున్కు చోటిచ్చారు.
కానీ అర్జున్ ప్రతిభను బట్టి చూస్తే జట్టులో చోటుకు అర్హుడు కాదని, కొంచెం గ్రేస్ మార్కులు వేసి అతడికి ముంబయి టీ20 జట్టులో చోటిచ్చారని అంటున్నారు. అండర్-19, 23 టోర్నీల్లో అర్జున్ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. ఇప్పటిదాకా ఐపీఎల్ వేలంలోకి కూడా అతను రాలేకపోయాడు. ముందు బ్యాట్స్మన్గా కెరీర్ ఆరంభించిన అర్జున్.. ఆ విభాగంలో సత్తా చాటలేకపోయాడు. దీంతో తర్వాత అతను ఫాస్ట్ బౌలర్గా మారాడు. ఇప్పుడు ప్రధానంగా బౌలింగ్, కొద్దిగా బ్యాటింగ్ చేయగల ఆల్రౌండర్ పాత్రలో కొనసాగుతున్నాడు. మరి ముస్తాక్ అలీ టోర్నీలో ముంబయి తుది జట్టులో అర్జున్కు చోటు దక్కుతుందా.. అవకాశం వస్తే ఏమైనా పెర్ఫామ్ చేస్తాడా అన్నది చూడాలి.
This post was last modified on January 3, 2021 12:46 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…