2020 వెళ్లిపోయింది. ఎన్నో ఆశలతో మేజిక్ ఫిగర్ లాంటి ఇయర్ లో తమకు మర్చిపోలేని ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తుందని భావిస్తే.. అందుకు భిన్నంగా కరోనాతో వణికించి వెళ్లిపోయింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్తగా ఏమైనా ఉంటుందా? అంటే.. నో చెప్పేస్తున్నాయి ఐటీ కంపెనీలు. 2020 ప్రభావం 2021 మీద కూడా ఉంటుందని తేలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు ఇంటి నుంచి పని చేసే విషయంలో కంపెనీలన్ని దాదాపుగా ఒకేలా ఆలోచిస్తున్నాయి.
హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైసెస్ అసోసియేషన్ (షార్ట్ కట్ లో చెప్పాలంటే హైసియా) తాజాగా ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం వర్కు ఫ్రంట్ ఆఫీస్ అన్నది ఇప్పట్లో సాధ్యం కాదని పలు కంపెనీలు తేల్చేశాయి. అయితే.. మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మంది మాత్రం ఆఫీసు నుంచి పని చేయక తప్పదని తేల్చారు. సర్వేలో భాగంగా 500 లోపు ఉద్యోగులు ఉన్న కంపెనీలతో పాటు.. 1000కు పైనే ఉద్యోగులు ఉన్న కంపెనీల అభిప్రాయాల్ని సేకరించారు. వీరంతా చెప్పిన దాని ప్రకారం.. గడిచిన 9 నెలల్లో చాలా కంపెనీలు తామున్న ఆఫీస్ స్పేస్ ను తగ్గించుకున్నాయి. దీంతో.. ఇప్పటికిప్పుడు గతంలో మాదిరి ఆఫీసులకు ఉద్యోగుల్ని తీసుకొచ్చే ఆలోచన చేయటం లేదు.
దీనికి కారణం లేకపోలేదు. ఇంటి నుంచి పని చేసే విషయంలో ఉద్యోగుల ఉత్పాదకత మెరుగ్గా ఉండటమే. ఆఫీసు నుంచి పని చేసే దానితో పోలిస్తే.. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగుల ఉత్పాదకత 90 శాతానికి పైగా బాగుండటంతో.. ఇదే విధానాన్ని మరికొంత కాలం కంటిన్యూ చేసే ఆలోచనలో కంపెనీలు ఉన్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగుల ఉత్పాదకత 100 శాతానికి పైనే నమోదుకావటంతో.. వర్కు ఫ్రంట్ హోంకు మించింది లేదన్న భావన వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది మార్చి నాటికి 20 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేసేలా ప్రణాళికల్ని కొన్ని కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు ఈ ఏడాది చివరికి 50 – 70 శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు తీసుకొచ్చి పని చేయాలని భావిస్తున్నారు. గతంలో మాదిరి నూటికి నూరుశాతం వర్కు ఫ్రంట్ ఆఫీసు అన్న విషయాన్ని మాత్రం ఏ కంపెనీ కూడా చెప్పకపోవటం గమనార్హం. అత్యవసర విభాగాలు.. కీలక ఉద్యోగుల్ని మాత్రమే ఆఫీసు నుంచి పని చేయిస్తున్నట్లుగా 75 శాతం పెద్ద కంపెనీలు పేర్కొన్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం రోటేషన్ లో భాగంగా.. క్లయింట్ల అవసరాలకు తగ్గట్లు వారంలో కొన్ని రోజులు ఆఫీసులో పని చేసేలా ప్లాన్ చేస్తున్నాయి. మొత్తంగా.. వర్కు ఫ్రం హోం ఈ ఏడాది వరకు కొనసాగటం ఖాయంగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.
This post was last modified on January 2, 2021 8:37 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…