‘బీడీఎస్ఎం రోల్ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ పేరుతో ప్రియుడిని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలు ప్రేమ, మృతుడు కిరణ్ ఇద్దరూ రాజాజీనగర్లోని మొబైల్ సర్వీస్ సంస్థలో కలిసి పనిచేస్తూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వివాహానికి కిరణ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అంజననగర్లోని తన ఇంటికి కిరణ్ను పిలిపించిన ప్రేమ, ‘సర్ప్రైజ్ ప్రపోజల్’ పేరుతో కుర్చీకి కట్టేసి, కళ్లకు గంత కట్టింది. అనంతరం ముందుగానే సిద్ధం చేసిన ఇంధనాన్ని పోసి నిప్పంటించి, ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రియుడి నిర్లక్ష్యం, పెళ్లికి అంగీకరించకపోవడంపై కలిగిన ఆవేదనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, సంబంధాల పేరుతో జరుగుతున్న వికృత చర్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 22, 2026 4:18 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…