‘బీడీఎస్ఎం రోల్ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ పేరుతో ప్రియుడిని నమ్మబలికి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితురాలు ప్రేమ, మృతుడు కిరణ్ ఇద్దరూ రాజాజీనగర్లోని మొబైల్ సర్వీస్ సంస్థలో కలిసి పనిచేస్తూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అయితే వివాహానికి కిరణ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో అంజననగర్లోని తన ఇంటికి కిరణ్ను పిలిపించిన ప్రేమ, ‘సర్ప్రైజ్ ప్రపోజల్’ పేరుతో కుర్చీకి కట్టేసి, కళ్లకు గంత కట్టింది. అనంతరం ముందుగానే సిద్ధం చేసిన ఇంధనాన్ని పోసి నిప్పంటించి, ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రియుడి నిర్లక్ష్యం, పెళ్లికి అంగీకరించకపోవడంపై కలిగిన ఆవేదనతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపగా, సంబంధాల పేరుతో జరుగుతున్న వికృత చర్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…