స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన సమాచారం వల్ల బయటపడింది. అందుకనే ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది.
డిసెంబర్ లో బ్రిటన్ నుండి తెలంగాణాకు వచ్చి సుమారు 3 వేలమందిని రెండు విధాలుగా వర్గీకరించారు ఉన్నతాధికారులు. మొదటి రెండు వారాల్లో వచ్చిన వారు కొందరు, చివర రెండువారాల్లో వచ్చిన వారు మరికొందరు. మొదటి రెండువారాల్లో వచ్చిన వారి సంఖ్య సుమారు 1800 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇలా వచ్చిన వారివల్ల పెద్దగ సమస్యలు లేవట.
అయితే చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మంది వల్లే సమస్య ఎక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆందోళనపడుతున్నారు. ఇంత ఆందోళన ఎందుకంటే కరోనా వైరస్ కన్నా రూపం మార్చుకున్న స్ట్రెయిన కరోనా 70 శాతం స్పీడుగా వ్యాపిస్తోందని శాస్త్రజ్ఞలు, వైద్య నిపుణులు చెప్పటమే. చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మందిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారట.
మొత్తం 3 వేలమంది ఆచూకీ కనుక్కునేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. కరీంనగర్లో 16 మంది, నిర్మల్ ముగ్గురు, వరంగల్, రంగారెడ్డిలో 270 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ కు ముగ్గురు చేరుకున్నట్లు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన వారిని గుర్తించి శాంపిల్సు కలెక్ట్ చేయటం ఉన్నతాదికారులకు తలకుమించిన పనిగా మారిపోయింది. వీళ్ళ సంగతి ఇలాగుంటే ఒక్క హైదరాబాద్ లోనే 800 మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.
టికెట్ల ఆధారంగా వాళ్ళ అడ్రస్సులు పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి అధికారుల ప్రయత్నాలు ఎప్పటికి సానుకూలమవుతాయో ఈలోగా వాళ్ళు ఎక్కడి నుండి ఇంకెక్కడికి ప్రయాణం చేస్తారో ఎవరికీ తెలీకుండా ఉంది. వీళ్ళ వల్ల ఇంకెంతమందికి స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకుతుందో అన్న కారణంగానే ఉన్నతాధికారులు టెన్షన్ పెరిగిపోతోంది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…