స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన సమాచారం వల్ల బయటపడింది. అందుకనే ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది.
డిసెంబర్ లో బ్రిటన్ నుండి తెలంగాణాకు వచ్చి సుమారు 3 వేలమందిని రెండు విధాలుగా వర్గీకరించారు ఉన్నతాధికారులు. మొదటి రెండు వారాల్లో వచ్చిన వారు కొందరు, చివర రెండువారాల్లో వచ్చిన వారు మరికొందరు. మొదటి రెండువారాల్లో వచ్చిన వారి సంఖ్య సుమారు 1800 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇలా వచ్చిన వారివల్ల పెద్దగ సమస్యలు లేవట.
అయితే చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మంది వల్లే సమస్య ఎక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆందోళనపడుతున్నారు. ఇంత ఆందోళన ఎందుకంటే కరోనా వైరస్ కన్నా రూపం మార్చుకున్న స్ట్రెయిన కరోనా 70 శాతం స్పీడుగా వ్యాపిస్తోందని శాస్త్రజ్ఞలు, వైద్య నిపుణులు చెప్పటమే. చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మందిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారట.
మొత్తం 3 వేలమంది ఆచూకీ కనుక్కునేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. కరీంనగర్లో 16 మంది, నిర్మల్ ముగ్గురు, వరంగల్, రంగారెడ్డిలో 270 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ కు ముగ్గురు చేరుకున్నట్లు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన వారిని గుర్తించి శాంపిల్సు కలెక్ట్ చేయటం ఉన్నతాదికారులకు తలకుమించిన పనిగా మారిపోయింది. వీళ్ళ సంగతి ఇలాగుంటే ఒక్క హైదరాబాద్ లోనే 800 మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.
టికెట్ల ఆధారంగా వాళ్ళ అడ్రస్సులు పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి అధికారుల ప్రయత్నాలు ఎప్పటికి సానుకూలమవుతాయో ఈలోగా వాళ్ళు ఎక్కడి నుండి ఇంకెక్కడికి ప్రయాణం చేస్తారో ఎవరికీ తెలీకుండా ఉంది. వీళ్ళ వల్ల ఇంకెంతమందికి స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకుతుందో అన్న కారణంగానే ఉన్నతాధికారులు టెన్షన్ పెరిగిపోతోంది.
This post was last modified on December 24, 2020 11:42 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…