Trends

తెలంగాణాలో పెరిగిపోతున్న ‘స్ట్రెయిన్’ టెన్షన్

స్ట్రెయిన్ కరోనా వైరస్ తెలంగాణా ప్రభుత్వాన్ని బాగా టెన్షన్ పెట్టేస్తోంది. ఎక్కడో బ్రిటన్ను రూపం మార్చుకున్న కరోనా వైరస్ వణికించేస్తోందంటే అర్ధముంది. మరి అదే వైరస్ తెలంగాణాను కూడా ఎందుకు వణికించేస్తున్నట్లు ? ఎందుకంటే బ్రిటన్ నుండి తెలంగాణాకు ఈనెలలో 3 వేలకు పైగా వచ్చారట. ఇలా వచ్చిన వారిలో అత్యధికులు అంటే సుమారు 800 మందికి పైగా హైదరాబాద్ లోనే ఉన్నట్లు ఎయిర్ పోర్టు అథారిటి నుండి అందిన సమాచారం వల్ల బయటపడింది. అందుకనే ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోతోంది.

డిసెంబర్ లో బ్రిటన్ నుండి తెలంగాణాకు వచ్చి సుమారు 3 వేలమందిని రెండు విధాలుగా వర్గీకరించారు ఉన్నతాధికారులు. మొదటి రెండు వారాల్లో వచ్చిన వారు కొందరు, చివర రెండువారాల్లో వచ్చిన వారు మరికొందరు. మొదటి రెండువారాల్లో వచ్చిన వారి సంఖ్య సుమారు 1800 మంది ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇలా వచ్చిన వారివల్ల పెద్దగ సమస్యలు లేవట.

అయితే చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మంది వల్లే సమస్య ఎక్కువగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆందోళనపడుతున్నారు. ఇంత ఆందోళన ఎందుకంటే కరోనా వైరస్ కన్నా రూపం మార్చుకున్న స్ట్రెయిన కరోనా 70 శాతం స్పీడుగా వ్యాపిస్తోందని శాస్త్రజ్ఞలు, వైద్య నిపుణులు చెప్పటమే. చివరి 14 రోజుల్లో వచ్చిన 1200 మందిలో 800 మంది హైదరాబాద్ లోనే ఉంటున్నారట.

మొత్తం 3 వేలమంది ఆచూకీ కనుక్కునేందుకు ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. కరీంనగర్లో 16 మంది, నిర్మల్ ముగ్గురు, వరంగల్, రంగారెడ్డిలో 270 మంది ఉన్నట్లు గుర్తించారు. ఆదిలాబాద్ కు ముగ్గురు చేరుకున్నట్లు గుర్తించారు. బ్రిటన్ నుండి వచ్చిన వారిని గుర్తించి శాంపిల్సు కలెక్ట్ చేయటం ఉన్నతాదికారులకు తలకుమించిన పనిగా మారిపోయింది. వీళ్ళ సంగతి ఇలాగుంటే ఒక్క హైదరాబాద్ లోనే 800 మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

టికెట్ల ఆధారంగా వాళ్ళ అడ్రస్సులు పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరి అధికారుల ప్రయత్నాలు ఎప్పటికి సానుకూలమవుతాయో ఈలోగా వాళ్ళు ఎక్కడి నుండి ఇంకెక్కడికి ప్రయాణం చేస్తారో ఎవరికీ తెలీకుండా ఉంది. వీళ్ళ వల్ల ఇంకెంతమందికి స్ట్రెయిన్ కరోనా వైరస్ సోకుతుందో అన్న కారణంగానే ఉన్నతాధికారులు టెన్షన్ పెరిగిపోతోంది.

This post was last modified on December 24, 2020 11:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

26 minutes ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

39 minutes ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

2 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

4 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

4 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago