క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ఇప్పుడు వాతావరణం రూపంలో ఒక పెద్ద అడ్డంకి ఎదురుకాబోతోంది. ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ పోరుపై వర్షం ముప్పు పొంచి ఉందనే వార్తలు అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియం మొత్తం ప్రస్తుతం కవర్లతో కప్పి ఉంచడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, ఆదివారం సాయంత్రం కొలంబోలో భారీ వర్షం కురిసే అవకాశం 70 శాతం వరకు ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మ్యాచ్ సమయంలో చినుకులు పడే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఫ్యాన్స్కు ఊరటనిచ్చే విషయం ఏంటంటే, ప్రేమదాస స్టేడియంలో గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పే అద్భుతమైన సదుపాయం ఉంది. వర్షం తగ్గిన వెంటనే కేవలం 20 నిమిషాల్లోనే గ్రౌండ్ను సిద్ధం చేసి ఆటను ప్రారంభించే అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్ నిర్వహణ వెనుక ఒక పెద్ద రాజకీయ డ్రామానే నడిచింది. మొదట భారత్ తో ఆడబోమని భీష్మించిన పాకిస్థాన్, ఐసీసీ, పొరుగు దేశాల ఒత్తిడితో చివరకు వెనక్కి తగ్గింది. కోట్లాది రూపాయల బిజినెస్, బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందాల కారణంగానే ఈ మ్యాచ్ కొలంబోలో ఖరారైంది. ఐపీఎల్ సమయంలో మొదలైన కొన్ని వివాదాలు సద్దుమణగడంతో, ఎట్టకేలకు దాయాదుల పోరుకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం టీమిండియా అదిరిపోయే ఫామ్లో ఉంది. అమెరికా నమీబియాపై భారీ విజయాలు సాధించిన సూర్యకుమార్ సేన, ఇప్పుడు 4 పాయింట్లతో టేబుల్ లో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో కూడా గెలిచి సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్నెట్ సాధించి జట్టులోకి రావడం భారత్ కు పెద్ద ప్లస్ పాయింట్. గత ఆసియా కప్ ఫైనల్ మాదిరిగానే ఈసారి కూడా పాక్ను చిత్తు చేయాలని టీమిండియా భావిస్తోంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ పూర్తిగా రద్దయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న భారత్ కు దీనివల్ల పెద్దగా నష్టం ఉండదు కానీ, పాకిస్థాన్ కు మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. ఏదేమైనా కనీసం ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోంది. ప్రకృతి సహకరించి ఈ మెగా ఫైట్ సజావుగా సాగాలని క్రికెట్ ప్రేమికులు కోరుకుంటున్నారు. మరి కొలంబో ఆకాశంలో రేపు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
This post was last modified on February 14, 2026 3:48 pm
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఒక కల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా నిలిచిపోయిన అదుర్స్ వచ్చి పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి.…
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని…
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా…
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ…
‘హిట్’ ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. కంటెంట్లో ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే.. ‘హిట్’ను…