Trends

ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మార్చుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), ఆధార్ హోల్డర్లు తమ మొబైల్ నంబర్లను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 28 నుంచి ఈ సరికొత్త సేవలు ప్రారంభం కానున్నాయి. యూఐడీఏఐ డే వేడుకల సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్చుకోవాలంటే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ కొత్త విధానం వల్ల ఫిజికల్ సెంటర్లపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాలు, ఇతర గుర్తింపు సేవలను సులభంగా పొందేందుకు ఈ సౌకర్యం ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి, వృద్ధులకు ఇది గొప్ప వెసులుబాటు అని చెప్పవచ్చు.

దేశంలోని డిజిటల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకింగ్ సేవలు, సబ్సిడీలు, ప్రభుత్వ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడానికి ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం తప్పనిసరి. లేటెస్ట్ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ మరింత సరళతరం కానుంది. దీనివల్ల డిజిటల్ సేవలు ప్రతి పౌరుడికి చేరువవుతాయని యూఐడీఏఐ భావిస్తోంది.

ఈ కొత్త సేవలను పొందడంలో ఆధార్ మొబైల్ అప్లికేషన్ కీలక పాత్ర పోషించనుంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ అధికారిక యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అత్యంత భద్రతతో కూడిన ఈ యాప్ ద్వారా యూజర్లు తమ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

సామాన్యులకు సైతం అర్థమయ్యేలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ సేవలను డిజైన్ చేశారు. ఈ కొత్త సదుపాయం ద్వారా కోట్లాది మంది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం చేకూరనుంది. మీ ఆధార్ కార్డ్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ అయి ఉందో లేదో ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

This post was last modified on January 27, 2026 10:22 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Adhar

Recent Posts

వైసీపీ ఏం చేయబోతోంది? ఎంపీలకు జగన్ క్లియర్ కట్ ఆదేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు…

12 minutes ago

అమెరికా నుంచి వచ్చేస్తున్నారు.. మంచిదేనా?

వృత్తి నిపుణులు, దేశంలో నైపుణ్య కేంద్రాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత నైపుణ్య కేంద్రాలకు…

1 hour ago

అకీరానే కాదు అందరూ జాగ్రత్త పడాలి

పవన్ కళ్యాణ్ వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్న అకీరానందన్ ఇంకా ఇండస్ట్రీకి రాకముందే హాట్ టాపిక్…

4 hours ago

ఇందుకే టీడీపీని రాజకీయ పాఠశాల అంటారు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ…

4 hours ago

షర్మిల ఢిల్లీ ప్రయాణం వెనుక ఇంత కథ ఉందా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఉన్న వైఎస్ ష‌ర్మిల‌.. రాజ్య‌స‌భ‌కు వెళ్తారంటూ కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. 2024…

5 hours ago

స్పిరిట్ మీద ఇన్ని పుకార్లు ఎందుకు

టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లోనూ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న స్పిరిట్ మీద పుకార్ల ప్రహసనం మాములుగా…

5 hours ago