అతిగా బీర్లు తాగడం వల్లే ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో కలకలం రేపింది. సంక్రాంతి పండుగకు సొంతూరికి వచ్చిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పోటీపడి అతిగా మద్యం సేవించడంతో ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన కంభంవారిపల్లి మండలం కే.వీ.పల్లి పరిధిలోని బండవడ్డిపల్లిలో చోటుచేసుకుంది. చెన్నై, బెంగళూరులో పనిచేస్తున్న ఆవలకుంట మణికుమార్ (34), వేముల పుష్పరాజ్ (26) పండుగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు.
పార్టీ సమయంలో మణికుమార్, పుష్పరాజ్ ఇద్దరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పోటీపడి మొత్తం 19 బీర్లు తాగినట్లు అధికారులు వెల్లడించారు. అధికంగా మద్యం సేవించడంతో వారు డీహైడ్రేషన్కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మణికుమార్ మార్గమధ్యంలో మృతి చెందగా, పుష్పరాజ్ చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ ఘటనను నకిలీ మద్యం తాగి చనిపోయినట్లుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అదే పార్టీకి హాజరైన ఆవలకుంట శ్రవణ్ కుమార్ (23), పసుపులేటి శివమణి (21), ఆవలకుంట వేణుగోపాల్ (20), కోటకొండ అభిషేక్ (18) తక్కువగా మద్యం సేవించడంతో వారు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి నిర్ధారణ కోసం వారు తాగిన బీరు శాంపుళ్లను చిత్తూరుకు పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు.
This post was last modified on January 19, 2026 11:03 am
విజువల్ ఎఫెక్ట్స్, సూపర్ హీరోస్, విచిత్ర జంతువులు ఇవేవీ లేకుండా ఒక హాలీవుడ్ మూవీకి ఇండియాలో బజ్ రావడం ఒక్క…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్లు ఈ వారం డార్లింగ్ పుణ్యమాని కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. రీ రిలీజుల ట్రెండ్…
వారణాసి విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఈ సినిమా ఏదో ఒక రూపంలో పబ్లిసిటీ అయ్యేలా రాజమౌళి ప్లానింగ్…
దక్షిణాది సినిమా ముఖచిత్రాన్ని మార్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో జెంటిల్మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు చిత్రాలతో…
పెద్దిలో నెలల తరబడి జనాన్ని సస్పెన్స్ లో పెట్టిన విషయం ఐటెం సాంగ్ హీరోయిన్. దర్శకుడు బుచ్చిబాబు ఎవరిని తెస్తాడనే…
కొన్ని జ్ఞాపకాలు చాలా చేదుగా అనిపిస్తాయి. వద్దన్నా గుర్తు చేసుకునే సందర్భాలు పలకరిస్తాయి. సరిగ్గా ఇదే రోజు 2003 ఏప్రిల్…