సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒక మహిళ అర్ధరాత్రి పూట మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఆర్డర్ చేయగా.. అక్కడికి వచ్చిన బ్లింకిట్ రైడర్ మాత్రం ఆమెకు అవి ఇవ్వడానికి నిరాకరించాడు. అసలు అతను అలా ఎందుకు చేశాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న అర్ధరాత్రి ఆ మహిళ బ్లింకిట్ యాప్ ద్వారా ఎలుకల మందును బుక్ చేసింది. డెలివరీ రైడర్ ఆ వస్తువులను తీసుకుని ఆమె ఇంటికి చేరుకున్నాడు. అయితే అక్కడ సీన్ చూడగానే అతనికి ఏదో తేడాగా అనిపించింది. డెలివరీ ఇవ్వడం తన డ్యూటీ అయినప్పటికీ.. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి అతను వెనక్కి తగ్గాడు. ఆ మహిళ ఇంటి వద్ద ఏడుస్తుండటాన్ని ఆ రైడర్ గమనించాడు. ఆమె కళ్ళలో ఏదో బాధను చూసిన అతను.. ఎలుకల మందు ఇవ్వకుండా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆ టైమ్లో ఎవరైనా నార్మల్ గా డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈ రైడర్ మాత్రం పరిస్థితిని గమనించి అక్కడే ఆగిపోయాడు. ఆమెను పలకరించి.. నీకు ఏమైనా సమస్య ఉందా అని అతను అడిగాడు. ఎలుకల సమస్య ఉంటే పగలే ఆర్డర్ చేయవచ్చు కదా అని ప్రశ్నించాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవి తెప్పించావా అని అడగ్గా.. ఆమె లేదని చెప్పినా అతను నమ్మలేదు. ఆ సమయంలో ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న అతను ఆమెకు ధైర్యం చెప్పాడు.
చాకచక్యంగా వ్యవహరించిన ఆ రైడర్.. ఆమెను ఒప్పించి ఆ ఆర్డర్ను అక్కడికక్కడే క్యాన్సల్ చేశాడు. ఒకవేళ తను ఆ మందు ఇచ్చి ఉంటే ఏదైనా అనర్థం జరిగేదేమోనని అతను భావించాడు. తను ఒక ప్రాణాన్ని కాపాడగలిగాననే తృప్తిని అతను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రైడర్ ఒక డెలివరీ మ్యాన్ లా కాకుండా ఒక మనిషిలా ఆలోచించాడని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…
రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ టీం సొంతమైన ఆటగాడు రిషబ్ పంత్.…