సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒక మహిళ అర్ధరాత్రి పూట మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఆర్డర్ చేయగా.. అక్కడికి వచ్చిన బ్లింకిట్ రైడర్ మాత్రం ఆమెకు అవి ఇవ్వడానికి నిరాకరించాడు. అసలు అతను అలా ఎందుకు చేశాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిన్న అర్ధరాత్రి ఆ మహిళ బ్లింకిట్ యాప్ ద్వారా ఎలుకల మందును బుక్ చేసింది. డెలివరీ రైడర్ ఆ వస్తువులను తీసుకుని ఆమె ఇంటికి చేరుకున్నాడు. అయితే అక్కడ సీన్ చూడగానే అతనికి ఏదో తేడాగా అనిపించింది. డెలివరీ ఇవ్వడం తన డ్యూటీ అయినప్పటికీ.. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి అతను వెనక్కి తగ్గాడు. ఆ మహిళ ఇంటి వద్ద ఏడుస్తుండటాన్ని ఆ రైడర్ గమనించాడు. ఆమె కళ్ళలో ఏదో బాధను చూసిన అతను.. ఎలుకల మందు ఇవ్వకుండా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
ఆ టైమ్లో ఎవరైనా నార్మల్ గా డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈ రైడర్ మాత్రం పరిస్థితిని గమనించి అక్కడే ఆగిపోయాడు. ఆమెను పలకరించి.. నీకు ఏమైనా సమస్య ఉందా అని అతను అడిగాడు. ఎలుకల సమస్య ఉంటే పగలే ఆర్డర్ చేయవచ్చు కదా అని ప్రశ్నించాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవి తెప్పించావా అని అడగ్గా.. ఆమె లేదని చెప్పినా అతను నమ్మలేదు. ఆ సమయంలో ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న అతను ఆమెకు ధైర్యం చెప్పాడు.
చాకచక్యంగా వ్యవహరించిన ఆ రైడర్.. ఆమెను ఒప్పించి ఆ ఆర్డర్ను అక్కడికక్కడే క్యాన్సల్ చేశాడు. ఒకవేళ తను ఆ మందు ఇచ్చి ఉంటే ఏదైనా అనర్థం జరిగేదేమోనని అతను భావించాడు. తను ఒక ప్రాణాన్ని కాపాడగలిగాననే తృప్తిని అతను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రైడర్ ఒక డెలివరీ మ్యాన్ లా కాకుండా ఒక మనిషిలా ఆలోచించాడని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…