Trends

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒక మహిళ అర్ధరాత్రి పూట మూడు ఎలుకల మందు ప్యాకెట్లను ఆర్డర్ చేయగా.. అక్కడికి వచ్చిన బ్లింకిట్ రైడర్ మాత్రం ఆమెకు అవి ఇవ్వడానికి నిరాకరించాడు. అసలు అతను అలా ఎందుకు చేశాడనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నిన్న అర్ధరాత్రి ఆ మహిళ బ్లింకిట్ యాప్ ద్వారా ఎలుకల మందును బుక్ చేసింది. డెలివరీ రైడర్ ఆ వస్తువులను తీసుకుని ఆమె ఇంటికి చేరుకున్నాడు. అయితే అక్కడ సీన్ చూడగానే అతనికి ఏదో తేడాగా అనిపించింది. డెలివరీ ఇవ్వడం తన డ్యూటీ అయినప్పటికీ.. అక్కడ జరుగుతున్న దాన్ని చూసి అతను వెనక్కి తగ్గాడు. ఆ మహిళ ఇంటి వద్ద ఏడుస్తుండటాన్ని ఆ రైడర్ గమనించాడు. ఆమె కళ్ళలో ఏదో బాధను చూసిన అతను.. ఎలుకల మందు ఇవ్వకుండా ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు.

ఆ టైమ్‌లో ఎవరైనా నార్మల్ గా డెలివరీ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఈ రైడర్ మాత్రం పరిస్థితిని గమనించి అక్కడే ఆగిపోయాడు. ఆమెను పలకరించి.. నీకు ఏమైనా సమస్య ఉందా అని అతను అడిగాడు. ఎలుకల సమస్య ఉంటే పగలే ఆర్డర్ చేయవచ్చు కదా అని ప్రశ్నించాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవి తెప్పించావా అని అడగ్గా.. ఆమె లేదని చెప్పినా అతను నమ్మలేదు. ఆ సమయంలో ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్న అతను ఆమెకు ధైర్యం చెప్పాడు.

చాకచక్యంగా వ్యవహరించిన ఆ రైడర్.. ఆమెను ఒప్పించి ఆ ఆర్డర్‌ను అక్కడికక్కడే క్యాన్సల్ చేశాడు. ఒకవేళ తను ఆ మందు ఇచ్చి ఉంటే ఏదైనా అనర్థం జరిగేదేమోనని అతను భావించాడు. తను ఒక ప్రాణాన్ని కాపాడగలిగాననే తృప్తిని అతను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ రైడర్ ఒక డెలివరీ మ్యాన్ లా కాకుండా ఒక మనిషిలా ఆలోచించాడని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అందరికీ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

This post was last modified on January 9, 2026 6:18 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Tamilnadu

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

7 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

9 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

9 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

12 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

13 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

15 hours ago