ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే పెద్ద దుమారం రేగింది. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తప్పించడం ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి నోటీసు వచ్చే వరకు టీవీల్లో గానీ, ఆన్ లైన్ లో గానీ ఐపీఎల్ చూడటం అక్కడ కుదరదు. భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సరైన కారణం లేకుండా తమ స్టార్ ప్లేయర్ ను అవమానించిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేకేఆర్ తీసుకున్న నిర్ణయం తమ ప్రజలను బాధించిందని, ఆగ్రహం తెప్పించిందని పేర్కొంది. మార్చి 26 నుంచి మొదలవ్వాల్సిన ఈ టోర్నీని బహిష్కరిస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రసారాలను ఆపేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అసలు ఈ గొడవకు మూల కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే. ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో భారత్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రూ. 9.20 కోట్లు పెట్టి వేలంలో కొన్న ముస్తఫిజుర్ ను వదిలేయాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. బోర్డు ఆదేశాల మేరకే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది.
దీనిపై ముస్తఫిజుర్ స్పందిస్తూ, “వాళ్లు నన్ను వదిలేస్తే నేనేం చేయగలను” అని నిరాశ వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ వివాదం వరల్డ్ కప్ కు కూడా పాకింది. భద్రతా కారణాల రీత్యా రాబోయే టీ20 వరల్డ్ కప్ లో తమ గ్రూప్ మ్యాచ్ లను భారత్ (ముంబై, కోల్ కతా) నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.
కేకేఆర్ నిర్ణయానికి కౌంటర్ గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ ప్రసారాలనే బ్యాన్ చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ కూడా బంగ్లా మ్యాచ్ లను శ్రీలంకకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
This post was last modified on January 5, 2026 4:02 pm
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…