ఐపీఎల్ 2026 సీజన్ మొదలవ్వకముందే పెద్ద దుమారం రేగింది. కోల్ కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ ను తప్పించడం ఇప్పుడు అంతర్జాతీయ వివాదంగా మారింది. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
తదుపరి నోటీసు వచ్చే వరకు టీవీల్లో గానీ, ఆన్ లైన్ లో గానీ ఐపీఎల్ చూడటం అక్కడ కుదరదు. భారత క్రికెట్ బోర్డు ఎలాంటి సరైన కారణం లేకుండా తమ స్టార్ ప్లేయర్ ను అవమానించిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేకేఆర్ తీసుకున్న నిర్ణయం తమ ప్రజలను బాధించిందని, ఆగ్రహం తెప్పించిందని పేర్కొంది. మార్చి 26 నుంచి మొదలవ్వాల్సిన ఈ టోర్నీని బహిష్కరిస్తూ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రసారాలను ఆపేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
అసలు ఈ గొడవకు మూల కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే. ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువుల పై దాడులు జరుగుతుండటంతో భారత్ లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రూ. 9.20 కోట్లు పెట్టి వేలంలో కొన్న ముస్తఫిజుర్ ను వదిలేయాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. బోర్డు ఆదేశాల మేరకే కేకేఆర్ అతన్ని రిలీజ్ చేసింది.
దీనిపై ముస్తఫిజుర్ స్పందిస్తూ, “వాళ్లు నన్ను వదిలేస్తే నేనేం చేయగలను” అని నిరాశ వ్యక్తం చేశాడు. మరోవైపు ఈ వివాదం వరల్డ్ కప్ కు కూడా పాకింది. భద్రతా కారణాల రీత్యా రాబోయే టీ20 వరల్డ్ కప్ లో తమ గ్రూప్ మ్యాచ్ లను భారత్ (ముంబై, కోల్ కతా) నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది.
కేకేఆర్ నిర్ణయానికి కౌంటర్ గా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ ప్రసారాలనే బ్యాన్ చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఐసీసీ కూడా బంగ్లా మ్యాచ్ లను శ్రీలంకకు మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న హీరో వడ్డే నవీన్ తనే నిర్మాతగా మారి ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులుతో…
టాలీవుడ్ యువ కథానాయకుడు నితిన్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో తన అభిమానులకు కూడా సరిగా గుర్తుండకపోవచ్చు. ‘భీష్మ’ తర్వాత…
సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…
నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…
పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు…
నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…