Trends

వెనక కూర్చున్నా… హెల్మెట్ ఉండాల్సిందే

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించే విషయంలో విశాఖ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన ట్రాఫిక్‌ పోలీసులు, వెనుక కూర్చున్న వారికి హెల్మెట్‌ లేకపోతే సెల్‌ఫోన్‌లో ఫొటో తీసి ఈ-చలాన్‌ జారీ చేస్తున్నారు. దీంతో వాహనదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

గత రెండు రోజుల్లో పిలియన్‌ రైడర్‌ హెల్మెట్‌ కారణంగా వేలాది ఈ-చలాన్‌లు జారీ అయినట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు 31 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, జనవరి 1 నుంచి ఈ-చలాన్‌ల ప్రక్రియ ప్రారంభించినట్లు ఉన్నతాధికారులు వివరించారు.

ఇదిలా ఉండగా, నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ పోలీసులు కొద్ది రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ‘నో హెల్మెట్‌–నో ఫ్యూయల్‌’ విధానాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించినప్పుడే పెట్రోల్‌ బంకుల్లో ఇంధనం అందిస్తామని స్పష్టం చేశారు. వాహనదారుల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

This post was last modified on January 3, 2026 11:08 am

Share
Show comments
Published by
Kumar
Tags: Helmet

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

3 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago