Trends

ఎడారి దేశంలో మంచు… మనకి గండమా?

సౌదీ అరేబియా ఎడారిలో మంచు కురవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఈ వింటర్ లో ఉత్తర ప్రాంతంలోని తబూక్ లో కొండలన్నీ మంచుతో నిండిపోయి వైట్ గా మారిపోయాయి. ఇది చూడటానికి అద్భుతంగా ఉన్నా, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయినా.. దీని వెనుక ఒక పెద్ద ప్రమాద హెచ్చరిక దాగి ఉంది. భూమి వాతావరణ వ్యవస్థలో మౌలిక మార్పులు వస్తున్నాయనడానికి ఇదే నిదర్శనం.

క్లైమేట్ చేంజ్ అంటే కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాతావరణం వేడెక్కే కొద్దీ, గాలిలో తేమ, ఎనర్జీ పెరిగి వెదర్ ప్యాట్రన్స్ అన్నీ తలకిందులు అవుతాయి. అందుకే ఎడారిలో మంచు కురుస్తోంది, చల్లని ప్రదేశాల్లో వేడి పెరుగుతోంది. ఇది ఇండియాకు కూడా ఒక సీరియస్ వార్నింగ్ బెల్ లాంటిదనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ ఏడాది మనం ఇండియాలో ఎన్నో విపరీతమైన పరిస్థితులను చూసాం. ఉత్తర, మధ్య భారతంలో రికార్డు స్థాయి ఎండలు మండిపోతే, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కింలలో క్లౌడ్ బరస్ట్స్ వల్ల వరదలు ముంచెత్తాయి. ఋతుపవనాలు కూడా దారి తప్పాయి. ఇవేవీ యాదృచ్ఛికంగా జరిగినవి కావు, క్లైమేట్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిలో ఉందని చెప్పడానికి ఇవే ఉదాహరణలు.

సౌదీలో మంచు కురవడాన్ని ఏదో వింతగా చూడకూడదనే హెచ్చరికలు వస్తున్నాయి. మన వ్యవసాయం, వాటర్ మేనేజ్మెంట్, సిటీ ప్లానింగ్ అన్నీ కాలానికి అనుగుణంగానే ఉంటాయి. ఇప్పుడు ఆ టైమ్ టేబుల్ మారిపోతే రైతుల నుంచి సిటీ జనాల వరకు అందరూ ఇబ్బంది పడతారు. ఇప్పటికైనా మనం వరదలను తట్టుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేడిని తట్టుకునే సిటీ ప్లానింగ్ పై దృష్టి పెట్టకపోతే మున్ముందు ఇంకా గడ్డు పరిస్థితులు తప్పవని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Kumar

Recent Posts

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

2 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

2 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

3 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

3 hours ago

‘పవన్ కల్యాణ్ పై దేశద్రోహం కేసు పెట్టాలి’

ఏపీ డిప్యూటీ సీఎం.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై కేసు పెట్టాల‌ని.. ఆయ‌న వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నార‌ని…

3 hours ago

జాబ్ కేలండర్ కాస్తా… సంక్షేమ కేలండర్ అయ్యిందే

2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…

3 hours ago