Trends

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా టూర్–2025 కోసం భారత్‌కు వచ్చారు. ఈ సాకర్ మాంత్రికుడి పర్యటనతో ఫుట్‌బాల్ అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెస్సీని ఒక్కసారి ప్రత్యక్షంగా చూసేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు అభిమానులు భారీగా ఖర్చు చేసేందుకు కూడా వెనుకాడటం లేదు.

హైదరాబాద్‌లో మెస్సీతో ఫోటో దిగేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఫీజు నిర్ణయించారు. ఈ అవకాశానికి ఇప్పటికే 60 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఫ్రెండ్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు 27 వేల మందికి పైగా టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో భేటీ కానుండటం ఈ ఈవెంట్‌కు మరింత ఆకర్షణగా మారింది.

అదే సమయంలో కోల్‌కతా లేక్‌టౌన్‌లోని శ్రీభూమి స్పోర్టింగ్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన లియోనెల్ మెస్సీ 70 అడుగుల భారీ విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో అపూర్వ ఉత్సాహాన్ని రేకెత్తించింది.

ఈ టూర్‌లో భాగంగా మెస్సీ ప్రత్యక్షంగా మ్యాచ్‌లు ఆడకపోయినా, అభిమానులతో ప్రత్యేక భేటీలు, వర్చువల్ ఈవెంట్లు, ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారతదేశంలో తనకు ఉన్న అపారమైన అభిమానాన్ని గౌరవిస్తూ ఈ పర్యటనను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

This post was last modified on December 13, 2025 11:47 am

Share

Recent Posts

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…

10 minutes ago

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

49 minutes ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

1 hour ago

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

1 hour ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

1 hour ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

4 hours ago