అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే మాత్రం జేబులో గట్టిగా డబ్బు ఉండాల్సిందే. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ కార్డు కావాలనుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు (1 మిలియన్ డాలర్లు) అమెరికా ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అదే కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగి కోసం అయితే రెట్టింపు మొత్తం చెల్లించాలి. ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే చాలా పవర్ ఫుల్ అని, దీని ద్వారా త్వరగా పౌరసత్వం వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. యాపిల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు తమ దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులను వీసా సమస్యల వల్ల కోల్పోతున్నామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమకు నచ్చిన టాలెంటెడ్ వ్యక్తులను ఎలాంటి భయం లేకుండా ఉద్యోగంలో కొనసాగించే వెసులుబాటు లభిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ దక్కే అవకాశం రావచ్చు.
ఇది కేవలం వలసదారుల కోసమే తెచ్చిన పథకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ కూడా ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారిని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే దేశంలోకి రానివ్వాలనేది ఈ గోల్డ్ కార్డ్ అసలు ఉద్దేశం.
ఐదేళ్లపాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే వీరికి సిటిజన్ షిప్ కూడా లభిస్తుంది. అయితే ఇది సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షే అయినా, సంపన్న వర్గాలకు మాత్రం ఒక వరం లాంటిది. అమెరికా కలలు కంటూ, వీసా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే బదులు, డబ్బుతో దర్జాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
This post was last modified on December 11, 2025 1:28 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…