అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే మాత్రం జేబులో గట్టిగా డబ్బు ఉండాల్సిందే. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ కార్డు కావాలనుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు (1 మిలియన్ డాలర్లు) అమెరికా ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అదే కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగి కోసం అయితే రెట్టింపు మొత్తం చెల్లించాలి. ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే చాలా పవర్ ఫుల్ అని, దీని ద్వారా త్వరగా పౌరసత్వం వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. యాపిల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు తమ దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులను వీసా సమస్యల వల్ల కోల్పోతున్నామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమకు నచ్చిన టాలెంటెడ్ వ్యక్తులను ఎలాంటి భయం లేకుండా ఉద్యోగంలో కొనసాగించే వెసులుబాటు లభిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ దక్కే అవకాశం రావచ్చు.
ఇది కేవలం వలసదారుల కోసమే తెచ్చిన పథకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ కూడా ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారిని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే దేశంలోకి రానివ్వాలనేది ఈ గోల్డ్ కార్డ్ అసలు ఉద్దేశం.
ఐదేళ్లపాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే వీరికి సిటిజన్ షిప్ కూడా లభిస్తుంది. అయితే ఇది సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షే అయినా, సంపన్న వర్గాలకు మాత్రం ఒక వరం లాంటిది. అమెరికా కలలు కంటూ, వీసా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే బదులు, డబ్బుతో దర్జాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ మధ్య నిత్యం వాగ్యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి…
యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి తిరిగి ప్రబలుతోందా? అంటే... ఇతర ప్రాంతాల గురించి అటుంచితే... ఏపీ విషయంలో మాత్రం నిజమేనేమోననే…
దేశంలో తెలుగు ప్రేక్షకులంత పెద్ద మనసు ఇంకెవరికీ ఉండదంటూ ఇతర భాషల ఫిలిం మేకర్స్ తెగ పొగిడేస్తుంటారు. ముఖ్యంగా తమిళ…
ఆదునిక సాంకేతికతను వినియోగించుకునే విషయంలో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు కీలక అడుగులు వేస్తున్నాయి. అందివచ్చిన సాంకేతికతతో ఆయా పార్టీలు తమ కార్యకలాపాల నిర్వహణ, కార్యకర్తలతో నిత్యం…
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…