అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే మాత్రం జేబులో గట్టిగా డబ్బు ఉండాల్సిందే. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ కార్డు కావాలనుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు (1 మిలియన్ డాలర్లు) అమెరికా ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అదే కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగి కోసం అయితే రెట్టింపు మొత్తం చెల్లించాలి. ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే చాలా పవర్ ఫుల్ అని, దీని ద్వారా త్వరగా పౌరసత్వం వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. యాపిల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు తమ దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులను వీసా సమస్యల వల్ల కోల్పోతున్నామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమకు నచ్చిన టాలెంటెడ్ వ్యక్తులను ఎలాంటి భయం లేకుండా ఉద్యోగంలో కొనసాగించే వెసులుబాటు లభిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ దక్కే అవకాశం రావచ్చు.
ఇది కేవలం వలసదారుల కోసమే తెచ్చిన పథకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ కూడా ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారిని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే దేశంలోకి రానివ్వాలనేది ఈ గోల్డ్ కార్డ్ అసలు ఉద్దేశం.
ఐదేళ్లపాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే వీరికి సిటిజన్ షిప్ కూడా లభిస్తుంది. అయితే ఇది సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షే అయినా, సంపన్న వర్గాలకు మాత్రం ఒక వరం లాంటిది. అమెరికా కలలు కంటూ, వీసా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే బదులు, డబ్బుతో దర్జాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
This post was last modified on December 11, 2025 1:28 pm
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…