అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో చదివిన మనవాళ్లు డిగ్రీ చేతికి రాగానే పెట్టేబేడా సర్దుకుని వెనక్కి రావాల్సి వస్తోంది. ఎంత టాలెంట్ ఉన్నా వీసా నిబంధనలు వాళ్లను అక్కడ ఉండనివ్వడం లేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఒక సరికొత్త స్కీమ్ తో ముందుకొచ్చారు. చదువుకున్నవాళ్లు వెళ్లిపోవడం దేశానికి అవమానం అని భావిస్తూ, వాళ్ళకోసం గోల్డ్ కార్డ్ ఆఫర్ ప్రకటించారు.
ఈ గోల్డ్ కార్డ్ పొందాలంటే మాత్రం జేబులో గట్టిగా డబ్బు ఉండాల్సిందే. ఎవరైనా వ్యక్తిగతంగా ఈ కార్డు కావాలనుకుంటే సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు (1 మిలియన్ డాలర్లు) అమెరికా ప్రభుత్వానికి బహుమతిగా ఇవ్వాలి. అదే కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగి కోసం అయితే రెట్టింపు మొత్తం చెల్లించాలి. ఇది సాధారణ గ్రీన్ కార్డ్ కంటే చాలా పవర్ ఫుల్ అని, దీని ద్వారా త్వరగా పౌరసత్వం వస్తుందని ట్రంప్ చెబుతున్నారు.
ఇప్పటివరకు టెక్ కంపెనీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ఇది చెక్ పెడుతుందని భావిస్తున్నారు. యాపిల్, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల సీఈఓలు తమ దగ్గర పనిచేసే విదేశీ ఉద్యోగులను వీసా సమస్యల వల్ల కోల్పోతున్నామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ ద్వారా కంపెనీలు తమకు నచ్చిన టాలెంటెడ్ వ్యక్తులను ఎలాంటి భయం లేకుండా ఉద్యోగంలో కొనసాగించే వెసులుబాటు లభిస్తుంది. కానీ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా తక్కువ మందికి ఈ ఆఫర్ దక్కే అవకాశం రావచ్చు.
ఇది కేవలం వలసదారుల కోసమే తెచ్చిన పథకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్లాన్ కూడా ఉంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవారిని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిని, అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే దేశంలోకి రానివ్వాలనేది ఈ గోల్డ్ కార్డ్ అసలు ఉద్దేశం.
ఐదేళ్లపాటు ఎలాంటి మచ్చ లేకుండా ఉంటే వీరికి సిటిజన్ షిప్ కూడా లభిస్తుంది. అయితే ఇది సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు అందని ద్రాక్షే అయినా, సంపన్న వర్గాలకు మాత్రం ఒక వరం లాంటిది. అమెరికా కలలు కంటూ, వీసా కోసం ఏళ్ళ తరబడి నిరీక్షించే బదులు, డబ్బుతో దర్జాగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
This post was last modified on December 11, 2025 1:28 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…