హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది దగ్గు ముఖం పట్టింది. బిహార్లోని ఒక జిల్లాలో మాత్రం హెచ్ఐవీ ఉధృతి పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఈ లెక్కలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 7400–8000 మధ్య హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 18 ఏళ్ల లోపు 252 మంది అబ్బాయిలు, 135 మంది అమ్మాయిలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఆరోగ్య రికార్డులు వెల్లడించాయి. పెద్దల్లో పురుషులు–మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ప్రతి నెల 40–60 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి అధికమైందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతామఢి ఏఆర్టీ సెంటర్లో ప్రతి నెల 5000 మంది రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు అందిస్తోంది.
2022 నుండి ప్రతి సంవత్సరం దాదాపు 500 కొత్త కేసులు చేరుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే, 2012 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు బిహార్ రాష్ట్రంలో మొత్తం 97,000 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, సీతామఢి జిల్లాలోనే 428 మంది పిల్లలు సహా 6707 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ–ఎయిడ్స్పై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో కేసులు తగ్గకపోవడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ అంశంపై స్థానిక అసిస్టెంట్ సివిల్ సర్జన్, హెచ్ఐవీ నోడల్ ఆఫీసర్ జే. జావేద్ మాట్లాడుతూ ఇది దగ్గుతో వచ్చే వ్యాధి కాదు, రక్త మార్పిడి లేదా ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది అన్నారు. పాఠశాలలో హెచ్ఐవి గురించి బోధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కూడా ఉందన్నారు. ప్రతి రోజు 250–300 మంది రోగులు మందులు తీసుకోవడానికి వస్తున్నారని ఆయన అన్నారు.
This post was last modified on December 11, 2025 11:57 am
అసలే బజ్ విషయంలో వెనుకబడి హైప్ కోసం నానా తంటాలు పడుతున్న వా వతియార్ (తెలుగులో అన్నగారు వస్తారు) విడుదల…
భారీ అంచనాల మధ్య ఓ పెద్ద హీరో సినిమా రిలీజైందంటే బాక్సాఫీస్ దగ్గర ఉండే సందడే వేరు. ఐతే ఈ…
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి చాలా ఏళ్ల నుంచి అమ్మాయిలకు ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి అలుపెరగని పోరాటం చేస్తున్న…
వివాదాస్పద ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యవహారం అందరికీ తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టోడియల్ విచారణలో చేయి చేసుకున్నారన్న…
అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్…
వైసీపీ నాయకులకు జగన్ తరచుగా హితవు పలుకుతున్నారు. ఎన్నికల వరకు ఓర్చుకోవాలని చెబుతున్నారు. దీనికి కారణం కొందరు ప్రస్తుతం కేసుల్లో…