హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది దగ్గు ముఖం పట్టింది. బిహార్లోని ఒక జిల్లాలో మాత్రం హెచ్ఐవీ ఉధృతి పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఈ లెక్కలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 7400–8000 మధ్య హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 18 ఏళ్ల లోపు 252 మంది అబ్బాయిలు, 135 మంది అమ్మాయిలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఆరోగ్య రికార్డులు వెల్లడించాయి. పెద్దల్లో పురుషులు–మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ప్రతి నెల 40–60 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి అధికమైందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతామఢి ఏఆర్టీ సెంటర్లో ప్రతి నెల 5000 మంది రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు అందిస్తోంది.
2022 నుండి ప్రతి సంవత్సరం దాదాపు 500 కొత్త కేసులు చేరుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే, 2012 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు బిహార్ రాష్ట్రంలో మొత్తం 97,000 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, సీతామఢి జిల్లాలోనే 428 మంది పిల్లలు సహా 6707 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ–ఎయిడ్స్పై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో కేసులు తగ్గకపోవడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ అంశంపై స్థానిక అసిస్టెంట్ సివిల్ సర్జన్, హెచ్ఐవీ నోడల్ ఆఫీసర్ జే. జావేద్ మాట్లాడుతూ ఇది దగ్గుతో వచ్చే వ్యాధి కాదు, రక్త మార్పిడి లేదా ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది అన్నారు. పాఠశాలలో హెచ్ఐవి గురించి బోధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కూడా ఉందన్నారు. ప్రతి రోజు 250–300 మంది రోగులు మందులు తీసుకోవడానికి వస్తున్నారని ఆయన అన్నారు.
This post was last modified on December 11, 2025 1:44 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…