హెచ్ఐవీ పై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం దీనిపై చైతన్యం తీసుకువచ్చేందుకు శాయశక్తుల కృషి చేస్తూ హెచ్ఐవి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఇది దగ్గు ముఖం పట్టింది. బిహార్లోని ఒక జిల్లాలో మాత్రం హెచ్ఐవీ ఉధృతి పెరుగుతుంది. తాజా గణాంకాల ప్రకారం సీతామఢి జిల్లాలో హెచ్ఐవీ కేసుల సంఖ్య దాదాపు 8 వేలకు చేరింది. ఈ లెక్కలు అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి.
జిల్లాలో ఇప్పటి వరకు 7400–8000 మధ్య హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 18 ఏళ్ల లోపు 252 మంది అబ్బాయిలు, 135 మంది అమ్మాయిలు హెచ్ఐవీతో బాధపడుతున్నట్లు ఆరోగ్య రికార్డులు వెల్లడించాయి. పెద్దల్లో పురుషులు–మహిళల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. ప్రతి నెల 40–60 కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే కార్మికుల కారణంగానే వైరస్ వ్యాప్తి అధికమైందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీతామఢి ఏఆర్టీ సెంటర్లో ప్రతి నెల 5000 మంది రోగులకు ప్రభుత్వం ఉచిత మందులు అందిస్తోంది.
2022 నుండి ప్రతి సంవత్సరం దాదాపు 500 కొత్త కేసులు చేరుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే, 2012 డిసెంబర్ నుండి 2025 డిసెంబర్ వరకు బిహార్ రాష్ట్రంలో మొత్తం 97,000 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, సీతామఢి జిల్లాలోనే 428 మంది పిల్లలు సహా 6707 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. హెచ్ఐవీ–ఎయిడ్స్పై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో కేసులు తగ్గకపోవడం ఆరోగ్య శాఖను ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ అంశంపై స్థానిక అసిస్టెంట్ సివిల్ సర్జన్, హెచ్ఐవీ నోడల్ ఆఫీసర్ జే. జావేద్ మాట్లాడుతూ ఇది దగ్గుతో వచ్చే వ్యాధి కాదు, రక్త మార్పిడి లేదా ఒకే సూదితో ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది అన్నారు. పాఠశాలలో హెచ్ఐవి గురించి బోధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి మరికొన్ని జిల్లాల్లో కూడా ఉందన్నారు. ప్రతి రోజు 250–300 మంది రోగులు మందులు తీసుకోవడానికి వస్తున్నారని ఆయన అన్నారు.
This post was last modified on December 11, 2025 1:44 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…