కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్లపై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ పాండ్యా (59 రన్స్) ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తే, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ను ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరి పాత స్కోర్లను బయటకు తీసి మరీ నిలదీస్తున్నారు.
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 12 పరుగులకే (11 బంతులు) ఔటయ్యాడు. అసలు సూర్య ఫామ్ చూస్తే ఎవరికైనా భయమేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గత 23 ఇన్నింగ్స్లలో సూర్య స్కోర్లు చూస్తే.. 20, 1, 39, 1, 12, 5, 0, 47, 7*, 2, 0, 14, 12, 0, 1, 4, 21, 75, 8, 29, 8, 26, 58*. ఒక మ్యాచ్లో 75 కొడితే, వరుసగా ఐదారు మ్యాచ్లలో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాడు. “ఒకరోజు చెలరేగి ఆడితే, మరుసటి మ్యాచ్ లలో డకౌట్ అవుతాడు. ఇదొక క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గిల్ vs జైస్వాల్:
ఇక వైస్ కెప్టెన్ గిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ మ్యాచ్లో 4 పరుగులకే వెనుదిరిగాడు. గత 15 ఇన్నింగ్స్లలో గిల్ స్కోర్లు: 58, 13, 34, 39, 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46. ఇందులో ఒక్కటి కూడా భారీ ఇన్నింగ్స్ లేదు, కనీసం నిలకడ లేదు. టీ20ల్లో మొదటి బంతి నుంచే అటాక్ చేసే యశస్వి జైస్వాల్ను పక్కనపెట్టి, గిల్ను ఆడించడం పెద్ద తప్పు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓపెనింగ్ విషయంలో మనం వెనక్కి వెళ్తున్నామని విశ్లేషిస్తున్నారు.
గంభీర్ ఫేవరిజం?
సూర్యను కెప్టెన్గా, గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం వెనుక గంభీర్, అగార్కర్ల “ఫేవరిజం” ఉందని టాక్ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, జైస్వాల్లను కాదని గిల్కు పదవి ఇవ్వడం, హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు పగ్గాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికి హార్దిక్ పాండ్యా, బౌలర్ల పుణ్యమా అని టీమిండియా గెలిచింది కానీ, కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ బ్యాట్తో సమాధానం చెప్పకపోతే ఈ ట్రోల్స్ ఆగేలా లేవు.
This post was last modified on December 10, 2025 2:26 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…