కటక్లో జరిగిన టీ20 మ్యాచ్లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్లపై విమర్శల వర్షం కురుస్తోంది. హార్దిక్ పాండ్యా (59 రన్స్) ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తే, టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ను ఫ్యాన్స్ ఎత్తిచూపుతున్నారు. ముఖ్యంగా వీరిద్దరి పాత స్కోర్లను బయటకు తీసి మరీ నిలదీస్తున్నారు.
కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో 12 పరుగులకే (11 బంతులు) ఔటయ్యాడు. అసలు సూర్య ఫామ్ చూస్తే ఎవరికైనా భయమేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. గత 23 ఇన్నింగ్స్లలో సూర్య స్కోర్లు చూస్తే.. 20, 1, 39, 1, 12, 5, 0, 47, 7*, 2, 0, 14, 12, 0, 1, 4, 21, 75, 8, 29, 8, 26, 58*. ఒక మ్యాచ్లో 75 కొడితే, వరుసగా ఐదారు మ్యాచ్లలో సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నాడు. “ఒకరోజు చెలరేగి ఆడితే, మరుసటి మ్యాచ్ లలో డకౌట్ అవుతాడు. ఇదొక క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ” అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
గిల్ vs జైస్వాల్:
ఇక వైస్ కెప్టెన్ గిల్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ మ్యాచ్లో 4 పరుగులకే వెనుదిరిగాడు. గత 15 ఇన్నింగ్స్లలో గిల్ స్కోర్లు: 58, 13, 34, 39, 20, 10, 5, 47, 29, 4, 12, 37, 5, 15, 46. ఇందులో ఒక్కటి కూడా భారీ ఇన్నింగ్స్ లేదు, కనీసం నిలకడ లేదు. టీ20ల్లో మొదటి బంతి నుంచే అటాక్ చేసే యశస్వి జైస్వాల్ను పక్కనపెట్టి, గిల్ను ఆడించడం పెద్ద తప్పు అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఓపెనింగ్ విషయంలో మనం వెనక్కి వెళ్తున్నామని విశ్లేషిస్తున్నారు.
గంభీర్ ఫేవరిజం?
సూర్యను కెప్టెన్గా, గిల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం వెనుక గంభీర్, అగార్కర్ల “ఫేవరిజం” ఉందని టాక్ నడుస్తోంది. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, జైస్వాల్లను కాదని గిల్కు పదవి ఇవ్వడం, హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకు పగ్గాలు ఇవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మొత్తానికి హార్దిక్ పాండ్యా, బౌలర్ల పుణ్యమా అని టీమిండియా గెలిచింది కానీ, కెప్టెన్, వైస్ కెప్టెన్ తమ బ్యాట్తో సమాధానం చెప్పకపోతే ఈ ట్రోల్స్ ఆగేలా లేవు.
This post was last modified on December 10, 2025 2:26 pm
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…