చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే మాజీ బ్యాంకర్కు మంగళవారం ఉరిశిక్ష అమలు చేశారు. చైనా హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ అనే ప్రభుత్వ రంగ సంస్థలో జనరల్ మేనేజర్గా పనిచేసిన ఆయన, దాదాపు 156 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు రూ. 1,300 కోట్లు లంచం తీసుకున్నట్లు కోర్టు నిర్ధారించింది.
2014 నుంచి 2018 మధ్య కాలంలో ప్రాజెక్టుల కొనుగోలు, ఫైనాన్సింగ్ విషయాల్లో కంపెనీలకు ఫేవర్ చేయడానికి ఆయన ఈ మొత్తం వసూలు చేశారు. సాధారణంగా చైనాలో అవినీతి కేసుల్లో మరణశిక్ష వేసినా, రెండేళ్ల తర్వాత దాన్ని యావజ్జీవ శిక్షగా మారుస్తుంటారు. కానీ ఈయన చేసిన నేరం “అత్యంత తీవ్రమైనది” కావడంతో, సుప్రీంకోర్టు ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా ఉరిశిక్షను ఖరారు చేసింది.
మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఇదే సంస్థ (హువారోంగ్) మాజీ చైర్మన్ లాయ్ జియావోమిన్కు కూడా 2021లో ఉరిశిక్ష వేశారు. ఆయన ఏకంగా 253 మిలియన్ డాలర్లు లంచం తీసుకున్నారు. అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న యుద్ధంలో ఈ సంస్థ అధికారులే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు.
మంగళవారం ఉదయం టియాంజిన్ నగరంలో బై తియాన్హుయికి శిక్ష అమలు చేశారు. అంతకుముందు చివరిసారిగా కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అయితే శిక్ష ఎలా అమలు చేశారన్నది (ఉరి లేదా విషపు ఇంజెక్షన్) మాత్రం అధికారులు బయటకు చెప్పలేదు. చైనాలో మరణశిక్షల సంఖ్య, వివరాలను “స్టేట్ సీక్రెట్”గా ఉంచుతారు.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్థిక రంగంలో అవినీతిని ఏమాత్రం సహించడం లేదని క్లారిటీగా అర్ధమవుతోంది. ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్, ఎవర్బ్రైట్ గ్రూప్ హెడ్ వంటి బడా బాబులకు కూడా జైలు శిక్షలు పడ్డాయి. అయితే కొందరు మాత్రం జిన్ పింగ్ తన రాజకీయ ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవడానికే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.
This post was last modified on December 10, 2025 8:27 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…